శ్రీకాకుళం- గురువు.. మన దేశంలో గరువుకు ప్రత్యేక స్థానం ఉంది. తల్లి దండ్రుల తరువాత అంతటి గొప్ప స్థానం గురువుకు ఇస్తాం మనం. కానీ కొంత మంది వల్ల గురువుకున్న మహోన్నత విలువ దిగజారిపోతోంది. కొందరు గురువుల ముసుగులే చేసే ఆకృత్యాల వల్ల తీవ్ర తలవంపులు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
పిల్లలకు మంచి, చెడులు నేర్పించాల్సిన టీచరే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పాఠాలు చెప్పాల్సిన గురువు తరగతి గదిలో నీలిచిత్రాలు చూపిస్తున్నాడు. పిల్లలను కన్న బిడ్డాల్లా చూసుకోవాల్సిన టీచర్, ఆ స్థానానికి మాయని మచ్చ తీసుకొచ్చాడు. విద్యార్ధులకు అశ్లీల వీడియోలు చూపించి తమ వికృత కోణాన్ని బయటపెట్టాడో ఉపాధ్యాయుడు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని నవగాం గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గొర్ల భానోజీ రావు టీచర్ గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా క్లాస్ లోని విద్యార్థులకు తన సెల్ ఫోన్ లో నీలి చిత్రాలను చూపిస్తూ దుర్మార్గంగా ప్రర్తిస్తున్నాడు. అశ్లీల చిత్రాల్లో కనిపించే మహిళలను చూపించి వారికి విద్యార్థినుల పేర్లు పెట్టి వికృతానందం పొందుతున్నాడు.
అంతేకాదు విద్యార్థినుల ఇంట్లో ఉన్న మహిళలను కూడా వారితో పోల్చి వారికి సైతం పేర్లు పెడుతున్నాడు. విద్యార్ధినుల శరీరాలు తాకడంతో పాటు నీలి చిత్రాలు చూడాలంటూ బలవంతం చేస్తున్నట్లు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఈ విషయం గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అంతా కలిసి సదరు కీచక టీచర్ ఉపాధాయుడిని నిలదీసి దేహశుద్ధి చేశారు. సర్పంచ్ నీరజ, తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.