ప్రకాశం క్రైం- ఈ మధ్యకాలంలో అమానుష ఘటనలు చూస్తోంటే సమాజం ఎటుపోతోందో అర్ధం కావడం లేదు. వావి వరసలు మరిచిని కామంధులు పేట్రేగిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి సిగ్గు ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీంతో మగాళ్లను చూస్తేనే మహిళలకు ఏవగింపు కలుగుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనా వార్డులో వైద్య సేవలందిస్తున్న నర్స్ పట్ల ఓ మహిళా రోగి కొడుకు ప్రవర్తించిన తీరు అంతా చీదరించుకునేలా చేసింది.
కరోనా సోకడంతో ఓ మహిళను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. సుమారు 22 రెండేళ్ల వయసు ఉన్న ఆమె కుమారుడు విజయ్ కుమార్ ఆమెకు కోడుగా వచ్చాడు. తన తల్లికి ట్రీట్మెంట్ చేస్తున్న నర్స్ పై వాడి కన్ను పడింది. కరోనాతో కొట్టుమిట్టాడుతున్న తన తల్లికి వైద్య సేవలందిస్తున్న నర్స్ పట్ల కృతజ్ఞత చూపాల్సిన అతను వక్రకోణంలో చూశాడు. తల్లికి వైద్య పరీక్షలు చేసేందుకు వచ్చిన నర్స్ ఒంటిపై చేయి వేసి, అసభ్యకరంగా ప్రవర్తించాడు.
హఠాత్తుగా వాడు చేసిన పనికి ఆ నర్స్ బిగ్గరగా అరిచింది. ఐతే ఆ కామాందుకు ఏ మాత్రం భయపడకుండా, ఆస్పత్రి వార్డులో అంత మంది ఉన్నారన్న ధ్యాస మరిచి, ఆ నర్సును బెడ్ పై పడేసి, ఆమెపై పడ్డాడు. ఈ పరిణామానికి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. అంతలోనే తెరుకుని వాడి నుంచి ఆ నర్సును కాపాడారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఈనెల 1న జరగ్గా, కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.