దేశంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మళ్లీ అధికారం కోసం, అధికారానికి దూరమైన పార్టీలు అధికారం కోసం.. ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నారు. యూపీలో ప్రస్తుతం విడతల వారీగా ఎన్నికలు జరగుతున్నాయి. పంజాబ్ రానున్న రోజులు ఎన్నికల జరగనున్నాయి. దీంతో అక్కడ ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. అక్కడ మిగిలిన పార్టీలు అధికారం కోసం చూస్తుండగా, అధికార కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ప్రచారం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో పంజాబ్ సీఎం చన్నీ లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తామని వెల్లడించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఏడాదిలోగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఉచిత విద్యను అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ సోమవారంనాడు హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ తనపై తప్పుడు ప్రచారం సాగిస్తూ.. క్రిమినల్ హిస్టరీ ఉన్న చాలామందికి టిక్కెట్లు ఇస్తోందని ఆయన మండిపడ్డారు. ఇతర రాజకీయ పార్టీల నుంచి వచ్చిన చాలా మందికి ఆప్ టిక్కెట్లు ఇచ్చిందని చన్నీ అన్నారు.
ఎన్నికల్లో భాగంగా సీఎం చన్నీ మీడియాతో మాట్లాడుతో…”కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరోసారి అధికారంలోకి వస్తే NS స్కాలర్ షిప్లను మరింత పటిష్టం చేస్తాం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పిల్లల కోసం ‘జనరల్ క్యాటగిరీ స్కీమ్’ తెస్తాం. రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో ఫీజులను రెగ్యులేట్ చేసేందుకు ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. తొలి ఆరు నెలల్లో పేదలకు పక్కా ఇళ్లు ఇస్తాం. నేను సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ టారిఫ్ తగ్గింపు, ఇంధనం ధరల తగ్గింపు సహా పలు నిర్ణయాలను ప్రకటించినాను” అని పంజాబ్ సీఎం చన్నీ తెలిపారు.