హైదరాబాద్ నగరంలో సినిమా అనగానే మొట్టమొదటిగా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్ గుర్తుకు వస్తుంది. కానీ ఇకపై ప్రసాద్ బిగ్ స్క్రీన్ పై IMAX సినిమాల ప్రదర్శనలు నిలిచి పోనున్నాయి. ఇదివరకు ప్రసాద్ లో సినిమాలన్నీ అనలాగ్ ప్రొజెక్టర్ ద్వారా IMAX ప్రింట్ (రీల్)తో విడుదల చేశారు. కానీ సినిమా ప్రొడక్షన్స్ లో డిజిటలైజేషన్ ఎంటర్ అవ్వడంతో.. రిలీజ్ ఫార్మట్స్ అన్ని డిజిటల్ వైపు మళ్ళాయి.
ప్రసాద్ లో రీల్స్ ప్రాసెసింగ్ – లాజిస్టిక్స్ ఖర్చును దృష్టిలో పెట్టుకొని ఇకపై రీల్స్లో సినిమాలు విడుదల చేయరని.. డిజిటల్ మాధ్యమాల ద్వారా ఇకపై సినిమాలు థియేటర్లో ప్రదర్శించబడతాయని సమాచారం. ఈ మధ్యకాలంలో సినిమాలను డిజిటల్ IMAX ఫార్మాట్లో తెరకెక్కించినా.. సినిమాలను భారీ స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేయగల డిజిటల్ ప్రొజెక్టర్ ప్రస్తుతం ప్రసాద్ థియేటర్ లో లేనందున ఇకపై IMAX చిత్రాలు రిలీజ్ కావని ప్రసాద్ యజమాన్యం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.