టీడీపీ నాయకుడిగా, పాలకొల్లు ఎమ్మెల్యేగా మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నిమ్మల రామానాయుడు పరిచయం. కానీ.., రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన పాలకొల్లులో చేసే సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఇక నిమ్మల రామానాయుడు ఏర్పాటు చేసిన కైలాస రథం.. పాలకొల్లు పరిసరాలలో కొన్నేళ్లుగా ఎంతో మందికి చివరి యాత్ర ప్రశాంతంగా జరగడానికి కారణం అయ్యింది.
కైలాస రథానికి నాలుగేళ్లుగా నాగేశ్వర్ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కోవిడ్ సమయంలోనూ కైలాస రథం సేవలు నిరంతరాయంగా కొనసాగాయి. అయితే.., తాజాగా నాగేశ్వర్ కి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో అతను ఐసోలేషన్ కి వెళ్ళాడు. దీంతో.., కైలాస రధం నడపడానికి డ్రైవర్స్ ఎవ్వరూ ముందుకి రాలేదు. వారందరిలో స్ఫూర్తిని నింపడానికి, భయాన్ని పోగొట్టడానికి ఏకంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రంగంలోకి దిగారు.
ఎమ్మెల్యే కైలాస రథంకి డ్రైవర్ గా మారి.., చనిపోయిన వ్యక్తిని స్మశానవాటికకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే వీడియోలో చివరగా డా.నిమ్మల రామానాయుడు స్పందించారు. “సాటి మనిషి కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవడం మానవ ధర్మం. ఇందుకే ఈరోజు నేను కైలాస రథం డ్రైవర్ గా మారాను.. నన్ను చూసి ఇప్పుడు కొంత మంది డ్రైవర్స్ ముందుకి వస్తున్నారు” అంటూ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఒక ఎమ్మెల్యే ఇలా.. కైలాస రథం డ్రైవర్ గా మారి, స్మశానికి రావడం గొప్ప విషయం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.