అదిలాబాద్- పాకిస్థానీలు మన తెలంగాణలో ఉన్నారని తెలుసా.. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా మూడు గ్రామాల్లో మొత్తం పాకిస్థానీలే ఉన్నారు. అదేంటీ తెలంగాణలో పాకిస్థానీలు ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది అక్షరాల నిజం. అదికూడా మన అదిలాబాద్ జిల్లాలోని ఇప్పటికీ పాకిస్థానీలు నివాసం ఉంటున్నారు.
గతంలో హైదరాబాద్ గోల్కొండ పైకి ఔరంగజేబు దండయాత్రకు వచ్చిన సమయంలో పాకిస్థాన్ లోని ముల్తానీ ప్రాంతం నుంచి కొంత మంది వలస వచ్చారు. ఔరంగజేబు బృందానికి వంట చేయడానికి, ఇతర పనులు నిర్వర్తించేందుకు వాళ్లంతా ఇక్కడికి వచ్చారు. ఐతే మళ్లీ వెనక్కి వెళ్లే సమయంలో కొంత మంది పాకిస్థాన్ ముల్తానీలు ఇక్కడే ఉండిపోయారు. వారికి అప్పటి నిజాం నవాబు ఆశ్రయం కల్పించారు.
అదిలాబాద్ అటవీ ప్రాంతంలో పాకిస్థాన్ ముల్తానీలకు నిజాం నవాబు సుమారు 5 వేల ఎకరాలను ఇనాంగా ఇచ్చారు. వారంతీ వ్యవసాయం చేసుకుని జీవించాలని నిజాం ఆదేశించారు. దీంతో పాకిస్థాన్ ముల్తానీలు అక్కడ మూడు గ్రామాలను ఏర్పాటు చేసుకుని బతకసాగారు. ఐతే ఆ తరువాత కరువు నేపధ్యంలో వాళ్లంతా దొంగతనాలు, దోపిడీలకు అలవాటు పడ్డారు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యే వారు.
ఆ సమయంలో ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారిగా పనిచేన ప్రస్తుత ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి వారికి ఉపాధి అవకాశాలు కల్పించారు. కొన్నాళ్లు దొంగతనాలు మానేసి బుద్దిగా పనులు చేసుకుని బతికిన ముల్తానీలు, ఈ మద్య కాలంలో మళ్లీ దొంగదనాలు, దోపిడీలను మొదలుపెట్టారని పద్మనాభ రెడ్డి చెప్పారు. ఐతే ఇప్పటికీ అదిలాబాద్ లో పాకిస్థాన్ ముల్తానీలు నివాసం ఉన్నారని చాలా మందికి తెలియదు.