ఇండియా పరమత సహనానికి పెట్టింది పేరు. మన దేశంలో ఎవరి దేవుళ్లను వాళ్ళు పూజించుకోవచ్చు. ఎవరి మతాచారాలను వారు పాటించుకోవచ్చు. ఇలానే ఉండాలి. ఈ దేవుడినే పూజించాలనే అనే రూల్స్ అస్సలు ఉండవు. కానీ.., మన దాయాది దేశమైన పాకిస్థాన్ లో ఇలాంటి పరిస్థితి ఉండదు. అక్కడ ముఖ్యంగా ఎప్పుడూ హిందువులే టార్గెట్ అవుతూ వస్తున్నారు. దేశంలో ఎలాంటి చిన్న గొడవ జరిగినా.., అక్కడి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం ఆనవాయితిగా వస్తోంది. తాజాగా పాకిస్థాన్ లో ఇలాంటి ఘటనే జరిగింది.
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల సిద్ది వినాయక దేవాలయంపై దుండగులు దాడి చేశారు. రహీం యార్ ఖాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా గుంపులు..గుంపులుగా సిద్ది వినాయక ఆలయంలోకి చొచ్చుకు వచ్చి.., ఈ విధ్వంసం సృష్టించారు. ఇనుప రాడ్లు, కర్రలు, బండరాళ్లతో ఆలయ వస్తువులను, విగ్రహాలను ధ్వంసం చేశారు. పవిత్ర గ్రంథాలకు నిప్పు పెట్టారు.
ఈ ప్రాంతంలో బతుకుతున్న దాదాపు 100 హిందూ కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారైంది. వీరంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. సోషల్ మీడియాలో జరిగిన ఓ చిన్న గొడవ.. ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. పాక్ కి చెందిన డాక్టర్ రమేష్ కుమార్ వాంక్వానీ.. ఈ ఘోరం తాలూకు దృశ్యాలను వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో.., ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. పాకిస్థాన్ లోని సిద్ది వినాయక ఆలయ దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.