కోవిడ్ -19 కొత్త వేరియెంట్ ఓమిక్రాన్.. దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుందనే ఆందోళనలతో మలేషియా నూతన సంవత్సర వేడుకలు నిషేధించబడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇప్పటికే దేశంలో రెండో ఓమిక్రాన్ కేసు నమోదు కావడం.. అలాగే 18 ఓమిక్రాన్ అనుమానిత కేసులు నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలేషియా ఆరోగ్యశాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
“రాబోవు 2022 నూతన సంవత్సర వేడుకలను అనుమతించడం జరగదు. అయితే.. న్యూ ఇయర్ లేదా క్రిస్మస్ సంబంధించి వేడుకలు చిన్నపాటిగా జరుపుకునే అవకాశం ఉంది. ఈ వేడుకల్లో పాల్గొనేవారు ముందుగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలి” అని ఆరోగ్యశాఖ తెలిపింది. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, బ్రిటన్ నుండి వచ్చే ప్రయాణికులకు వ్యతిరేకంగా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ ఓమిక్రాన్ వేరియెంట్ ను ఎదుర్కొనేందుకు.. డిసెంబర్ 17 నుండి ప్రయాణికులు క్వారంటైన్ టైంలో కోవిడ్ పరీక్షల రిపోర్ట్స్ ప్రభుత్వ కోవిడ్ మేనేజ్మెంట్ యాప్లో నివేదించాలని తెలిపారు.అంతేగాక.. ‘హై-రిస్క్’ దేశాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. బ్రిటన్, యుఎస్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, నార్వే, డెన్మార్క్, కెనడా, నైజీరియా మరియు భారతదేశం నుండి వచ్చే యాత్రికులు కమ్యూనిటీలో ఓమిక్రాన్ వేరియంట్ క్వారంటైన్ సమయంలో మణికట్టు డిజిటల్ ట్రాకర్లను అమర్చాలని నిబంధనలు విధించింది మలేషియా. మరి ఇకపై వేరే దేశాలు కూడా ఇదే బాటలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తాయేమో చూడలి. మలేసియా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.