మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరుకి పరిచయమే అవసరం లేదు. సినీ సామ్రాజ్యంలో ఆయన మకుటం లేని మహారాజు. 6 పదుల వయసులో కూడా చిరు తెలుగు సినిమాని శాసిస్తూ చిరు అగ్రపథాన దూసుకెళ్తున్నారు. ఇక మెగాస్టార్ రేంజ్ గురించి చెప్పుకోవాలంటే అప్పట్లో దర్శకుడు సుకుమార్ చేసిన ఓ కామెంట్ ని గుర్తుకి తెచ్చుకోవాలి. సీఎం పదవి కన్నా మెగాస్టార్ పదవి ఎంతో గొప్పదంటు ఆ మధ్య ఓ మూవీ ఫంక్షన్ లో సుకుమార్ కామెంట్ చేశాడు. అయితే.., ఇప్పుడు ఆ మాట అక్షర సత్యం అయ్యింది. దేశ ప్రధాని, ఎంపీలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సైతం అందని గౌరవం ఇప్పుడు చిరంజీవికి దక్కింది.
టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళలు సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా పీవీ సింధు చైనా క్రీడాకారిణి మీద గెలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. అలా వరుసగా రెండు సార్లు ఒలంపిక్స్ పతకాలు గెలిచిన భారత మొట్టమొదటి మహిళగా పీవీ సింధు రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ప్రధాని ఇలా అందరూ సింధూని అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పీవీ సింధూని అభినందించారు.
ప్రధాని, ముఖ్యమంత్రులు, ఎంపీల ట్వీట్స్ కి స్పందించని ఒలింపిక్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్.. మెగాస్టార్ వేసిన ట్వీట్ కి మాత్రం ఆమె ఎంతో స్ఫూర్తివంతురాలు అంటూ రిప్లయ్ ఇచ్చింది. దీంతో.. మెగాస్టార్ రేంజ్ ఇది అంటూ.. ఇప్పుడు నెటిజన్స్ ఆ ట్వీట్స్ ని వైరల్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
Congrats @Pvsindhu1 on winning the medal & creating history for being the first Indian woman to bring an Olympic medal twice in a row.Delighted that both medals won so far are by Indian women! No stopping our Women Power!! You make India proud!#MirabaiChanu @Pvsindhu1 #Tokyo2020 pic.twitter.com/kZn9C0SwcN
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 1, 2021