ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి.. అలా వైకుంఠపురం సినిమాతో హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఈ భామ.. టాలీవుడ్ స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్ అయ్యింది. మహేష్ బాబు టూ అఖిల్ వరకు అందరి సరసన చేసింది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజకు రాధే శ్యామ్ సినిమా భారీ షాకిచ్చింది. ఎన్నో అంచనాలు, భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ప్లాఫ్ అయ్యింది. ఇక ఆ తరువాత పూజ నటించిన ఆచార్య, తమిళంలో వచ్చిన బీస్ట్ సేమ్ రిజల్ట్ని చవి చూశాయి. ఇక తాజాగా పూజా హెగ్డే మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఆచార్య విడుదల తర్వాత సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న పూజ.. విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.
ఇక సినిమాలు వరుసగా ప్లాఫ్ అవుతున్నప్పటికి.. పూజ ప్రసుత్తం ఫుల్ ఖుషిగా ఉంది. ఎందుకంటే సైమా 2022లో ఓకేసారి ఏకంగా రెండు అవార్డులు గెలుచుకుంది ఈ భామ. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటనకు గాను పూజకు బెస్ట్ హీరోయిన్ అవార్డు దక్కగా.. సైమా యూత్ ఐకాన్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇలా ఒకేసారి రెండు అవార్డులు సొంతం చేసుకోవడంతో పూజ తెగ ఖుషీ అవుతోంది. కానీ నెటిజనులు మాత్రం పూజను తెగ ట్రోల్ చేస్తున్నారు. డబ్బులు పెట్టి అవార్డులు కొనుకుంది అంటూ విమర్శిస్తున్నారు.
అసలు ఏం జరిగింది అంటే.. సైమా 2022 బెస్ట్ హీరోయిన్ కెటగిరీలో పూజా హెగ్డేతో పాటు సాయి పల్లవి కూడా ఉంది. శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ చిత్రాలకు గాను సాయి పల్లవిని బెస్ట్ హీరోయిన్ కేటగిరీలో నామినేట్ చేశారు. ఇక ఫైనల్గా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటనకు గాను పూజా హెగ్డేకు బెస్ట్ హీరోయిన్ అవార్డు వచ్చింది. దాంతో నెటిజనులు పూజా హెగ్డేని ఓ రేంజ్లో ట్రెల్ చేస్తున్నారు. బెస్ట్ హీరోయిన్ అవార్డ్ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు చేశావ్ ఏంటి అని ఎద్దేవా చేస్తున్నారు. అయితే బెస్ట్ హీరోయిన్ నామినేషన్స్లో సాయి పల్లవి పేరు లేకపోతే ఇంత రచ్చ జరిగిదే కాదేమో అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్ ఇలా అన్ని స్కిల్స్ పుష్కలంగా ఉన్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం సాయి పల్లవి. సైమా అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ హీరోయిన్ కేటగిరీలో సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు నామినేట్ అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి నటన, డ్యాన్స్ సూపర్బ్ అంటూ ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సాయి పల్లవి నటన, డ్యాన్స్ అద్భుతంగా ఉన్నాయి.. ఈ సారి జాతీయ అవార్డు వచ్చిన ఆశ్చర్యం లేదన్నారు సినిమా విడుదలైన సమయంలో కొందరు విశ్లేషకులు.
అంత అద్భుతంగా నటించిన సాయి పల్లవిని వదిలేసి.. పూజా హెగ్డేకు అవార్డు ఇవ్వడం ఏంటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అసలు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంలో పూజా ఓ సాధారణ యువతి పాత్ర పోషించిందని.. ఆమె కెరీర్లో అది బెస్ట్ క్యారెక్టర్ కావొచ్చేమో కానీ.. అవార్డు అందుకునేంత గొప్పగా మాత్రం నటించలేదు అంటున్నారు. పూజ డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కుంది అని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.