స్పోర్ట్స్ డెస్క్- టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశం నుంచి చాలా మంది క్రీడాకారులు పాల్గొంటున్నా ఇప్పటి వరకు ఒక్క బంగారు పతకం కూడా రాలేదని కొంత ఆవేధన చెందుతూ వస్తున్నాం. కానీ మన దేశానికి గోల్డ్ మెడల్ రానే వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ లభించింది. శనివారం ఫురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన నీరజ్ చోప్రా 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు జావెలిన్ని విసిరిన నీరజ్ చోప్రా, ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 87.58మీటర్లు, మూడో ప్రయత్నంలో 76.93మీటర్లు విసిరాడు.
నీరజ్ చోప్రా నాలుగో ప్రయత్నంలోనూ 80మీటర్లకు దగ్గరగా జావెలిన్ని విసిరినా అది కాస్త ఫెయిల్ అయ్యింది. 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్లో షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించగా, ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా అరుదైన రికార్డును నెలకొల్పాడు. అథ్లెటిక్స్లో ఒలింపిక్స్ చరిత్రలో మన దేశానికి బంగారు పతకం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మొట్టమొదటి సారి ఒలింపిక్స్లో ఆడుతున్న 23 ఏళ్ల నీరజ్ చోప్రా, 86.59 మీటర్లు జావెలిన్ త్రోని విసిరి ఫైనల్కి అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ ఫైనల్లోనూ నీరజ్ చోప్రాకి మిగతా వారెవ్వరు సమీపంలోకు కూడా చేరుకోలేకపోయారు. నీరజ్ చోప్రా అత్యుత్తమ త్రో 88.07 మీటర్లు కావడం అరుదైన రికార్డేనని చెప్పవచ్చు.
ఇక టొక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు ప్రముఖుల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలు సినీ, రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కూడా నీరజ్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇది భారత్కు నిజంగా ఒక అద్భుతమైన క్షణమని, ఈ క్షణం రావడానికి 101 సంవత్సరాలు పట్టిందని చిరంజీవి అన్నారు.
THIS Is AN ABSOLUTELY GLORIOUS MOMENT FOR INDIA!!! 101 years in the Making for this moment!
An Olympic Gold in Athletics!!@Neeraj_chopra1 Take A Bow!!!
You have scripted History and You have changed the Course of History!!! #Olympics #Tokyo2020 #GoForGold pic.twitter.com/8jhY4uskrZ— Chiranjeevi Konidela (@KChiruTweets) August 7, 2021