ఫిల్మ్ డెస్క్- నయనతార, విగ్నేష్ శివన్.. ఈ ప్రేమ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న నయన్, విగ్నేష్ లు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న నయనతార, విగ్నేష్ లు త్వలరోనే వివాహబంధంతో ఒక్కటి కానున్నారని తెలుస్తోంది.
నయనతార, విగ్నేష్ శివన్ లు గత కొన్ని రోజులుగా గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విగ్నేష్ శివన్, ఆ తరువాత ముంబైలోని మహాలక్ష్మి ఆలయం, సిద్ధి వినాయక్ ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా షిరిడి చేరుకుని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. పెళ్లికి ముందు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అన్నీ కుదిరితే వచ్చే యేడాది మార్చి లో నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారైనా వీళ్లిద్దరు ఒక్కటవుతారా అన్నదే అందరిలో కలుగుతున్న సందేహం. నయవతార సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్తో కలిసి సినిమాలును కూడా నిర్మిస్తోంది. అన్నట్లు నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అన్నాత్తే లో హీరోయిన్గా నటించింది నయనతార. అన్నాత్తే సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. మరోవైపు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాక్కుల రెండు కాదల్ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలతో పాటే అట్లీ, షారుఖ్ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ లయన్ లో హీరోయిన్గానూ నయనతార నటిస్తోంది.