మేఘాలను తాకే ఎత్తైన భవనాలను చూశాం.మేఘాల్లోంచి దూసుకుపోయే విమానాన్ని చూశాం. కానీ మేఘాలకు పైన నిర్మించిన బ్రిడ్జ్ని చూశారా? అది ఎక్కడో కాదు మన దేశంలోనే. మేఘాలపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. దీని పేరు చీనాబ్ బ్రిడ్జ్.ఈ బ్రిడ్జ్ ని జమ్మూకశ్మీర్లోని రియాసీ జిల్లాలో గల చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. రైల్వే బ్రిడ్జ్ సరికొత్త ఫోటోలను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పోస్టు చేశారు. మేఘాలపై చినాబ్ బ్రిడ్జ్ ఆర్చీ ఉన్నట్లు ఆ ఫోటోకు ఆయన క్యాప్షన్ కూడా ఇచ్చారు.
ఇప్పటి వరకు ప్రపంచంలో ఎత్తైన నిర్మాణం అనగానే పారిస్ లోని ఈఫిల్ టవర్ గుర్తుకు వచ్చేది. అయితే త్వరలోనే ఈ రికార్డును రైల్వే బ్రిడ్జ్ బ్రేక్ చేయనుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కన్నా ఇంకా ఎత్తుగానే ఉంటుంది. అయితే ఇది ఎక్కడో విదేశాల్లో ఉందనుకుంటే.. పొరపాటే. ఇది మన దగ్గరే ఉంది. హిమాలయ పర్వతాలపై నిర్మిస్తున్న ఆ బ్రిడ్జ్ సుమారు 1315 మీటర్ల పొడువు ఉంది. కశ్మీర్ వ్యాలీలో కనెక్టివిటీని పెంచేందుకు ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కన్నా ఇది 35 మీటర్ల ఎత్తు ఎక్కువ ఉంది.
बादलों के बीच अद्भुत इंजीनियरिंग का नमूना पेश करता चिनाब रेल पुल।
जम्मू-कश्मीर के रियासी जिले में चिनाब नदी पर बन रहे 359 मीटर ऊंचे चिनाब पुल का एक शानदार दृश्य।#Infra4India pic.twitter.com/5uIW7mZqoJ
— Ministry of Railways (@RailMinIndia) February 8, 2022
కశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడంలో ఈ వంతెనది కీలకపాత్ర అని చెబుతుంటారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్ లో భాగంగా ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లాకు లింక్ చేసే కత్రా, బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల స్ట్రెచ్ ను ఈ రైల్వే బ్రిడ్జ్ లింక్ చేస్తుంది. ఆర్చ్ పై రైల్వే ట్రాక్ నిలబడేలా 17 ఇనుప పిల్లర్లతో రైల్ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నారు. ఆర్చ్ పొడవు 476 మీటర్లుగా పేర్కొన్నారు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ వంతెన నిర్మిస్తున్నారట. ఈ ఫొటోలను రైల్వే శాఖ పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదో సివిల్ ఇంజనీరింగ్ అద్భుతమని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. భూమి మీదకు స్వర్గం దిగొచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు.