కేశవన్ (67) అనే వ్యక్తి తన భార్య దయాతో కలిసి కొయంబత్తూరు ఎక్స్ ప్రెస్ రైలులో ఢిల్లీ నుంచి కోజికోడ్ వెళ్తున్నారు. రైలులో బీ4 కోచ్ లో 67, 68 నంబర్ గల సీట్లలో భార్యాభర్తలిద్దరూ కూర్చున్నారు. రైలు వేగంగా వెళ్తుంది. కేశవన్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. సడన్ గా గుండెపోటుతో కుప్పకూలి పడిపోయారు. రైలు మధుర రైల్వే స్టేషన్ లో రైలు ఆగడంతో ప్రయాణికులతో తన భర్త కేశవన్ ను ట్రైన్ లోంచి దించి.. ప్లాట్ ఫార్మ్ మీద పడుకోబెట్టారు దయా. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అంబులెన్స్ కోసం కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు. అయితే కేశవన్ కి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది.
అది గమనించిన రైల్వే పోలీసులు.. అతని భార్యను నోటి ద్వారా ఊపిరి ఇమ్మని సలహా ఇచ్చారు. దీంతో ఆమె తన భర్తకు నోటి ద్వారా 33 సెకన్ల పాటు నోటి ద్వారా ఊపిరి అందిస్తూ వచ్చారు. మరోవైపు రైల్వే పోలీసులు కూడా అతని అరి చేతులను రుద్దుతూ తీవ్రంగా శ్రమించారు. ఇంతలో అంబులెన్స్ రావడంతో కేశవన్ ను అంబులెన్స్ లో రైల్వే ఆస్పత్రికి తరలించారు. అయితే కేశవన్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో.. అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అతనికి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స చేస్తున్నామని, కేశవన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. దీంతో కేశవన్ భార్య ఊపిరి పీల్చుకున్నారు.
ఈ దంపతులు కేరళ జిల్లా కాసర్ గోడ్ లో ఉంటున్నారు. రెండు వారాల క్రితం 80 మంది బృందంగా ఏర్పడి ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా ఇలా జరిగిందని కేశవన్ భార్య దయా అన్నారు. కాగా ఆమె కొడుకు నీరజ్ కూడా డాక్టరేనట. ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ సిటీలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. తన తండ్రికి గుండెపోటు అని తెలియగానే కొడుకు కూడా మధుర వచ్చారు. అసలు ఆ సమయంలో ఎవరికైనా ఏదైనా అయితే కాళ్ళూ, చేతులూ ఆడవు. ఈ విషయంలో ముఖ్యంగా ఆడవాళ్లు కాస్త సున్నితంగా ఉంటారు. అలాంటిది ఈమె భయపడకుండా తన భర్తకి ఊపిరి పోసి ప్రాణాలని కాపాడుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చేసిన పనికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.