మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలి చేసిన వ్యాఖ్యలు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని అవమానానికి గురిచేశాయి. కొన్నేళ్ల నుంచి మంచి మిత్రదేశంగా ఉన్న ఖతర్ తో స్నేహ సంబంధాలపై ప్రభావం కూడా చూపాయి. యాభై ఏళ్ల దౌత్య సంధాలకు ప్రతీకగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్ ఎమిర్ అమీర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ ఇష్టపడలేదు. ఇద్దరి మధ్య షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన విందు సమావేశం అర్ధాంతరంగా రద్దు అయింది. వైద్య కారణం వల్ల విందు సమావేశం రద్దు చేసుకొంటున్నట్లు ఖతర్ అధికార వర్గాలు భారత విదేశాంగ అధికారులకు సమాచారం అందించాయి.
దీంతో విందు సమావేశం అనంతరం జరగాల్సిన ఇద్దరి నేతల సంయుక్త మీడియా సమావేశం కూడా రద్దయినట్లు తెలిపారు. బయటకి వైద్య కారణాలు చెప్తునప్పటికీ.. అసలు కారణం మాత్రం వేరే ఉన్నట్లు సమాచారం. అది బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అంయిడొచ్చుని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం ఖతార్ ప్రధాని ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ థానీ, మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా, వెంకయ్యనాయుడు భేటి అయ్యారు. ఖతర్ డిప్యూటీ ఎమిర్ మాత్రం వెంకయ్యనాయుడు సమావేశం కాలేకపోయారు. ఒక పక్క భారత ఉపరాష్ట్రపతి ఖతర్ పర్యటనలో ఉండగానే.. మరో పక్క అక్కడి ప్రభుత్వం భారత దౌత్యవేత్తకు సమన్లు ఇచ్చింది. భారత్లో బీజేపీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
The Vice President, Shri M. Venkaiah Naidu visited Qatar National Museum in Doha today. @MEAIndia pic.twitter.com/JEcM1u25bF
— Vice President of India (@VPSecretariat) June 6, 2022
ఇదీ చదవండి: ఆ ఏడుగురు MLA లకు ఈ సారి నో టికెట్.. తేల్చి చెప్పిన సీఎం జగన్!