టీకా వేయించుకున్న తర్వాత కొవిడ్ సోకడం చాలా అరుదు. అలాంటిది ఏకంగా 40 వేల మందికిపైగా వైరస్ సోకడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, వ్యాక్సిన్ ద్వారా అభివృద్ధి చెందే రోగ నిరోధకశక్తి నుంచి వైరస్ ఎలా తప్పించుకుంటోందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేసులతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం జన్యు క్రమాన్ని కనుగొనేందుకు నమూనాలు పంపాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని కోరింది. ఫలితంగా ఈ కేసులకేమైనా వైరస్ జన్యుమార్పిడి కారణమా? అన్ని విషయాన్ని కనుగొననుంది.
కేరళలోని కేసుల తీరును చూస్తే కరోనా మహమ్మారి విజృంభిస్తోందా అనిపిస్తోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని వేయించుకుంటున్నప్పటికీ 40వేల మందికిపైగా కొవిడ్ సోకం కేరళ ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. టీకా తీసుకున్న తర్వాత కొవిడ్ సోకడమనేది అరుదు. అలాంటి ఏకంగా 40వేల మందికి వైరస్ సోకడంపై ప్రభుత్వం విస్మయానికి గురవుతోంది. టీకా ద్వారా అభివృద్ధి చెందుతున్న రోగనిరోధకవ్యవస్థను ఈ వైరస్ తప్పించుకుంటోందా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
కొత్త కొత్త వేరియంట్లు కొత్త కొత్త వేవ్లకు కారణమవుతున్నాయి. దేశాన్ని భయపెట్టిన కరోనా రెండోదశకు డెల్టా వేరియంట్ కారణమన్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి కొత్త వేరియంట్ల విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటున్నాయి.