ఉత్తరాఖాండ్ లో ఘోరం ప్రమాదం జరిగింది. భక్తులతో కేదార్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లతో పాటు మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు కేదార్నాథ్ ఆలయానికి రెండు కీలోమీటర్లో గరుడ పర్వతం దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ బయలు దేరిన సమయానికే వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయని.. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు అంటున్నారు.
ప్రమాదం జరిగిన విషయం తెలియగానే వెంటనే సంఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది బయలు దేరినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులతో ఫటా నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే విపరీతంగా వర్షం కురిసిందని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భారత దేశంలో కేదార్ నాథ్ దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది.
దీపావళి సందర్భంగా ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ట్రెక్కింగ్ చేయలేని వారి కోసం హెలికాప్టర్ సౌకర్యం ఉంటుంది. ఈ క్రమంలోనే భక్తులు హెలికాప్టర్ లో బయలు దేరగా ఈ ఘోర ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
#WATCH | Uttarakhand: A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; administration team left for the spot for relief and rescue work. Further details awaited pic.twitter.com/sDf4x1udlJ
— ANI (@ANI) October 18, 2022