ఈ మద్య చిన్న చిన్న విషయాలకే మనుషులు విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నారో అన్న విషయం మరచి ఎదుటివారిపై దాడులు కూడా చేస్తున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిస్తూ.. వారికి బంగారు బాటలు వేయాల్సిన గురువులు.. ఈ మద్య ఆ స్థానానికే మచ్చ తెస్తున్నారు. విద్యార్థుల ముందు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు కొట్టుకోవడంతో వారి పరువు పోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలోని మహేంగు ఖేరా గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో అజిత్ వర్మ అనే వ్యక్తి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఇదే స్కూల్లో పని చేస్తున్న ఓ మహిళా టీచర్ ఆ పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ స్కూల్కు లేట్గా ఎందుకు వచ్చారంటూ ఆమెను నిలదీశారు. అంతేకాదు తన బూటు తీసి మహిళా టీచర్ అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేశాడు. అక్కడ ఉన్న సిబ్బంది.. సహ ఉపాధ్యాయులు ఎంతగా వారించినా ప్రిన్సిపల్ కోపంతో ఊగిపోతూ.. ఆమెపై దాడి చేశాడు. తనపై దాడి చేయడంతో ఆ ఉపాధ్యాయురాలు సైతం తన చెప్పుతో ప్రిన్సిపల్ పై దాడికి దిగింది. ఈ ఘటన పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు చూస్తుండగా జరిగింది. అక్కడే ఉన్న కొందరు వీరి గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ విషయం కాస్త రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన అధికారులు ఉపాధ్యాయురాలిపై దాడికి పాల్పడిన ప్రిన్సిపల్ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్.. తాను ముందుగా ఉపాధ్యాయురాలితో ప్రశాంతంగానే మాట్లాడానని.. ఆమె ఆలస్యంగా వస్తుందని, పలుసార్లు సంతకం చేసి వెళ్లిపోతుందని, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా తనపై దుర్భాషలాడుతుందని తెలిపాడు. మొదట ఆమెనే తనపై దాడి చేసిందని.. తర్వాత తాను అలా చేయాల్సి వచ్చిందని అన్నారు. విద్యార్థుల ముందు ఉపాధ్యాయుల గొడవకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Principal of a government school in Uttar Pradesh’s Lakhimpur thrashed a female teacher with shoes
(Source: Viral video) pic.twitter.com/hCRiMuVsgV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 24, 2022