గత కొంత కాలంగా దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇటీవల పలు చోట్ల రాజకీయ నేతలకు సంబంధించిన కాన్వాయ్ లు ప్రమాదాలకు గురి అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కాన్వాయ్ రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ లక్నో నుండి ఖేరీకి ఒక కార్యక్రమం కోసం బయలుదేరారు. అదే సమయంలో ఆయన కాన్వాయ్ లోని ఒక వాహనం అంబులెన్స్ కి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మెడికల్ సిబ్బందితో పాటు ఆరుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయినట్లు ఏసీపీ రాజీవ్ దీక్షిత్ తెలియజేశారు.
ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ సహ ఆయన సిబ్బంది క్షేమంగా బయట పడ్డారు. దీంతో అక్కడ ఉన్న ఇతర నాయకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గాయ పడిన వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ ఘటన తర్వాత డిప్యూటీ సీఎం తన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని ఏసీపీ రాజీవ్ దీక్షిత్ తెలిపారు.
Uttar Pradesh | Deputy CM Brajesh Pathak was going from Lucknow to Kheri for a program. A police vehicle and an ambulance, part of the convoy collided, injuring 1-2 people of medical staff and 6 police personnel: Dr Rajiv Dixit, ASP, North Sitapur pic.twitter.com/D2VbZSJHRs
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 14, 2022