భారత్లో ఆధార్ కార్డు ఇప్పుడు అందరికీ తప్పనిసరిగా మారింది. ప్రతిదానికీ ఆధార్ నంబర్ ఉండాల్సిందే. అలాంటి ఆధార్లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నయా సేవల్ని తీసుకొచ్చింది. ఈ కొత్త సర్వీసు ద్వారా పలు రకాల సేవల్ని ఈజీగా పొందేందుకు వీలు కలుగుతుంది.
మన దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యంగా మారిందో తెలిసిందే. విద్య, ఉద్యోగం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు ఇలా దాదాపుగా ప్రతిదాంట్లో ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. బ్యాంక్లో ఖాతా కావాలన్నా, ఆఖరుకు మొబైల్ సిమ్ కొనాలన్నా ఆధార్ నంబర్ చెప్పాల్సిందే. ఆధార్ అందరికీ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు ఉన్నవారికి తీపివార్తను అందించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన కొత్త చాట్ బాట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త సేవల ద్వారా ఆధార్కు సంబంధించిన పలు రకాల సేవల్ని సులువుగా పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ ఏఐ చాట్ బాట్కు ఆధార్ మిత్రగా యూఐడీఏఐ నామకరణం చేసింది. ఆధార మిత్ర ద్వారా ఆధార్ సెంటర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వీలు ఉన్న సమయంలో వెళ్లి పని పూర్తి చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ చాట్ బాట్ ద్వారా ఆధార్కు సంబంధించిన పీవీసీ స్టేటస్, ఫిర్యాదుల నమోదు, వాటిని ట్రాక్ చేయడం లాంటి అనేక రకాల సర్వీసులను ఈజీగా పొందొచ్చని యూఐడీఏఐ తెలిపింది.
ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి, పిల్లల కోసం కొత్త కార్డు తీసుకోవడానికి సమీపంలో ఉండే ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఆధార్ మిత్రను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో యూఐడీఏఐ తమ ట్విట్టర్ అకౌంట్లో ఓ క్యూఆర్ కోడ్ను కూడా ఉంచింది. ఈ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా నేరుగా ఆధార్ మిత్ర సేవల్ని పొందేందుకు వీలు కలుగుతుంది. మరి, కేంద్రం ఆధార మిత్ర చాటా బాట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ResidentFirst#UIDAI’s New AI/ML based chat support is now available for better resident interaction!
Now Residents can track #Aadhaar PVC card status, register & track grievances etc.
To interact with #AadhaarMitra, visit- https://t.co/2J9RTr5HEH@GoI_MeitY @PIB_India pic.twitter.com/fHlVd0rXTv— Aadhaar (@UIDAI) February 14, 2023