కాసేపట్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. అందరు సంతోషంలో మునిగి తేలుతున్నారు. పక్క ఊరి నుంచి తమ బంధువులు వస్తున్నారనే సమాచారం పెళ్లి ఇంటి వారికి తెలిసింది. వారి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే పెళ్లి వారికి విగతజీవులుగా బంధువులు కనిపించడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇక రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో అంగవైకల్యం ఏర్పడి.. జీవితాన్ని నరకంగా గడపుతున్నారు. తాజాగా ఛత్తీస్ గఢ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ పెళ్లి ఇంట విషాదాన్ని నింపింది. బుధవారం రాత్రి జరిగిన ఈ రోడ్డుప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే కావడంతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బాలోడ్ జిల్లా బుధవారం రాత్రి ఎస్యూవీ, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. అయితే బాధితులంతా ధమ్తారీ జిలాల్లోని సోరమ్, భడ్గావ్ గ్రామాలకు చెందిన వారు. వారంతా ఓ వివాహానికి వెళ్తున్నారు. బుధవారం రాత్రి సమయంలో వారు ప్రయాణిస్తోన్న ఎస్యూవీ కారును ఎదురుగా వస్తోన్నా ట్రక్ బలంగా ఢీ కొట్టింది. దీంతో ఎస్యూవీలో ప్రయాణిస్తున్నవారిలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రగాయలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వివిధ వాహనాల్లో స్థానిక ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించారు. అలానే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లిలో సందడి చేయాల్సిన వాళ్లు ఇలా విగత జీవులుగా మారడంతో విషాదం అలుముకుంది.
ఈ ఘటనలో మరణించిన వారందరు ఒకే కుటుంబానికి చెందిన వారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం రాయ్పూర్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ చెప్పారు. ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బాఘెల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన అందరు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ఇలా అతివేగాల కారణంగా అమాయకుల ప్రాణాలు పోతుండటంపై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Chhattisgarh |10 killed and one child seriously injured after a truck and car collided near Jagatra in Balod district. The injured has been referred to Raipur for better treatment. Search for the driver of the truck underway: Jitendra Kumar Yadav, SP Balod pic.twitter.com/imklW8bqlP
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 3, 2023