ప్రేమ అనే రెండు అక్షరాల పదం ఎప్పుడు ఎవరి మధ్య ఏర్పడుతుందో చెప్పలేము. కేవలం ఆడ, మగ మధ్య మాత్రమే ప్రేమ పుట్టదు. ఎవరి మధ్య అయినా ఎప్పుడైన ప్రేమ పుట్టవచ్చు. అటువంటి ప్రేమ ఇద్దరు అమ్మాయిల మధ్య పుట్టింది. ఈక్రమంలో వారిద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. కానీ, అందుకు వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారిద్దరినీ బలవంతగా వేరు చేశారు. చివరకు ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. కోర్టు కూడా ఆ అమ్మాయిల ఇద్దరికి వత్తాసు పలికింది. ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించొచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కేరళకు చెందిన అదిలా, ఫాతిమా చదువు కోసం సౌదీ అరేబియా వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకి అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. చివరకు కలసి జీవించాలని నిర్ణయానికి వచ్చారు. కొన్నిరోజులకు లివింగ్ రిలేషన్ షిప్ ప్రారంభించగా..వారి కుటుంబ సభ్యులు అడ్డుచెప్పారు. వాళ్లిద్దరు గతనెల 19న కోజికోడ్ లో కలుసుకున్న వారిద్దరూ…అక్కడి షెల్టర్ హోంలో కొన్నిరోజులు ఆశ్రయం పొందారు. ఆ విషయం తెలిసి..అదిలా కుటుంబ సభ్యులు ఆమెతో పాటు ఫాతిమాను తమ ఇంటికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: అదృష్టం అంటే వీళ్లది.. బంధువుల కోసం వెళ్లి రూ.10 కోట్ల జాక్ పాట్ కొట్టేశారు!
Kerala High Court allows lesbian couple Adhila Nassrin and Fathima Noora to live together on a habeas corpus plea filed by Adhila.
— ANI (@ANI) May 31, 2022
కొన్నిరోజులకు ఫాతిమా బంధువులు అదిలా వాళ్ల ఇంటికి వచ్చి.. ఆమెను తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అదిలా కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయసింది. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. వారిద్దరు మేజర్లు కాబట్టి వారి జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు వారు తీసుకునే హక్కు ఉందని కోర్టు తెలిపింది. మరి..ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.