ఈ మధ్యకాలంలో క్రూర మృగాలు అడవులను వదలి జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పొలాల్లో పనులు చేసుకుంటున్న వారికిపై దాడులు చేస్తున్నాయి. ఇలా పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు దాడిచేసిన ఘటనల్లో కొందరు ప్రాణాలు కొల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. అయితే వీటిని జనవాసాల్లోకి రాకుండా ఎప్పటికప్పుడు అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాటిని పట్టుకుని తిరిగి అడవుల్లో వదలి పెడుతున్నారు. అయినా అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఈ కూర్ర మృగాల సంచారం కనిపిస్తుంది. తాజాగా కర్ణాటకలోని మైసూర్ జిల్లాని ఓ ప్రాంతంలోకి చిరుతపులి వచ్చి కొందరిపై దాడి చేసింది. కొన్ని గంటల పాటు ఆ ప్రాంతంలో చిరుతపులి బీభత్సవం సృష్టించింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటక రాష్ట్రం మైసూర్ జిల్లాలోని కేఆర్ నగర్ ప్రాంతంలో శివార్లలో ఉన్న కనక నగర్ ప్రాంతంలో శుక్రవారం ఓ చిరుత కలకలం సృష్టిచింది. అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా.. అడవిలో నుంచి ఓ చిరుతపులి అక్కడికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొందరిపై చిరుత దాడి చేసింది. ముళ్లూరు రోడ్డు సమీపంలోని రాజా ప్రకాష్ స్కూల్ రోడ్డులో ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా అతనిపై దాడి చేసింది. దీంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. అనంతరం జనాల అరుపులకు చిరుత ఆ ప్రాంతంలోనే అటుఇటు పరుగులు తీసింది. స్థానికులు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. స్థానికుల అధికారులు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలంకి అటవీ అధికారులు చేరుకున్నారు. చాలా సమయం పాటు చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు శ్రమించారు. చివరకు మత్తుమందు ఇచ్చి బోనులో బంధించారు. అనంతరం దాన్నిని ఓ ప్రత్యేక వాహనంలో సురక్షిత ప్రాంతాన్నికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Karnataka: A leopard entered the Kanaka Nagar of Mysuru & attacked some people, he was later captured & rescued by the forest department pic.twitter.com/yVBIcfOyxM
— ANI (@ANI) November 4, 2022