ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య విచిత్రమైన సమస్యలు వస్తున్నాయి. చిన్నపాటి గొడవలకు విడాకుల వరకు వెళ్తున్నారు. ఏమాత్రం సర్ధుకపోయే మనసత్వం చాలా మంది దంపతుల్లో కొరవడింది. దీంతో విడాకులు కావాలంటూ చాలా మంది భార్యాభర్తలు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు చిత్ర విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. తన భార్యకు హైచ్ఐవీ ఉందని, ఆమెతో విడాకులు ఇప్పించాలని కోర్టు మెట్లు ఎక్కాడు. దీంతో అతడి పిటిషన్ స్వీకరించిన కోర్టు..ఇరువైపుల వాదనలు విని..అదిరిపోయే తీర్పు ఇచ్చింది.
ఓ వ్యక్తి విడాకులు కావాలంటూ 2011 ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు హెచ్ఐవీ ఉందని, విచిత్రంగా ప్రవర్తిసుందని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఆమె ప్రవర్తనకు తన ఇంట్లో కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, తొందరగా కోపగించుకుంటుందని, దయచేసి ఆమెతో విడాకులు ఇప్పించాలని కోర్టును వేడుకున్నాడు. కానీ, ఫ్యామిలీ కోర్టు అతడి పిటిషన్ను తోసిపుచ్చింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ బొంబాయ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇక్కడ ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. అతడి పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ఇరువైపుల వాదనలు వినింది. అతడి పిటిషన్ జస్టిస్ నితిన్ జామదార్, జస్టిస్ శర్మిలా దేశ్ ముఖ్ ల డివిజన్ బెంచ్ ముందుకు వెళ్లింది. సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగిన అనంతరం నవంబర్ 16న ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది. పిటిషనర్ కు మానసిక క్షోభ కలిగించడానికి కారణమైన అతడి భార్యకు హెచ్ఐవీ ఉన్నట్లు రిపోర్టును సమర్పించనేలేదని వివరించింది. తన భార్యకు హెచ్ఐవీ ఉన్నదన్నట్టుగా ఆయన చేసిన ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే ఆయన విడాకుల పిటిషన్ను తోసిపుచ్చుతున్నట్టు పేర్కొంది.
అతడి భార్యకు హెచ్ఐవీ ఉన్నట్లు అతడు చెప్పిన మాటలో వాస్తవం లేదని, అతడు మానసిక క్షోభ అనుభవించానని పిటిషనర్ వాదించాడని కోర్టు తెలిపింది. కానీ, అసలు అతడి భార్యకు హెచ్ఐవీ ఉన్నదనే విషయాన్ని నిరూపించలేకపోయాడని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఆమెతో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేకనే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసినట్లు కోర్టు తెలిపింది. అంతేకాకుండా అతని బంధువులు, మిత్రులు, సమాజంలో సదరు మహిళకు హెచ్ఐవీ ఉన్నదని చెప్పడం మూలంగా రెస్పాండెంట్కే మానసిక వ్యధ కలిగించారని వివరించింది. హెచ్ఐవీ లేకున్నా.. ఉన్నదని అబద్ధాలాడి విడాకులు తీసుకోజూసిన పిటిషనర్ పిటిషన్ కొట్టేస్తున్నట్టు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాక మరోసారి ఇలాంటి అసత్య ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృధా చేస్తే కఠిన శిక్ష ఉంటుందని హెచ్చరించింది.