ఓ జీవితంలో వెలుగు నిండాలంటే చదువును మించిన ఆయుధం ఇంకోటి ఉండదు. ఇంట్లో ఒక్కరు బాగా చదువుకుంటే ఆ కుటుంబం మొత్తానిది తలరాత మారిపోద్ది. కానీ.., మనలో చాలా మంది ఆ చదువును నిర్లక్ష్యం చేస్తుంటారు. పరిస్థితుల కారణంగా మధ్యలో ఆగిపోయే చదువులే చాలా ఎక్కువ. కానీ.. తమిళనాడుకి చెందిన తంగపచ్చి కథ అది కాదు. వ్యవసాయ కూలీగా పని చేస్తూనే చదువు గాడి తప్పకుండా చూసుకుంది తంగపచ్చి. నీట్ లో ర్యాంక్ సాధించింది. ఆ వివరాలు..
ఈ అమ్మాయి పేరు తంగపచ్చి. నిరు పేద కుటుంబం. అయినప్పటికీ వ్యవసాయ కూలీగా పనిచేస్తూ NEET నేషనల్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పాసయింది. అయితే నిరుపేద అయిన తంగపచ్చి డాక్టర్ కోర్స్ చేయడానికి డబ్బుల్లేవు. ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వెంటనే స్పందించి తంగపచ్చి కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తంగపచ్చి డాక్టర్ కోర్స్ అయ్యే వరకు పార్టీనే అన్ని ఖర్చులు భరిస్తుందని హామి ఇచ్చారు. ప్రధాని మోది గారి పేరు మీద తంగపచ్చి కు అన్నమలై గారు సహాయం చేయనుండటం విశేషం.