మంత్రులు, అధికారుల ఇళ్లలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో కోట్లలో నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ లో జరిగిన రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అధికారులతో పాటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని సిట్టింగ్ మంత్రి పార్థా ఛటర్జీ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి పరేశ్ సి.అధికారి నివాసంలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వీరే కాకుండా టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య, అర్పితా ముఖర్జీ, మాజీ మంత్రులే కాకుండా విద్యాశాఖకు చెందిన మరికొందరి అధికారుల ఇళ్లలోనూ సోదాలు నిర్విహిస్తున్నారు. అయితే ఈ తనిఖీల్లో సిట్టింగ్ మంత్రి పార్థా ఛటర్జీకి అత్యంత ఆప్తురాలైన అర్పితా ముఖర్జీ నివాస పరిసరాల్లో రూ.20 కోట్లు ఈడీ స్వాధీనం చేసుకుంది. బ్యాంకు సిబ్బంది సాయంతో ఈడీ అధికారులు లెక్కిస్తున్నారు.
ED is carrying out search operations at various premises linked to recruitment scam in the West Bengal School Service Commission and West Bengal Primary Education Board. pic.twitter.com/i4dP2SAeGG
— ED (@dir_ed) July 22, 2022
అర్పితా ముఖర్జీ ఇంట్లో నగదు తోపాటుగా 20 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నారు. అసలు అన్ని ఫోన్లు ఎందుకు ఉన్నాయనే విషయంపై దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు. ఇదంతా పశ్చిమ బెంగాల్ ఎస్ఎస్సీ స్కామ్లో ముట్టిన సొమ్ముగా అనుమానిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
WB: ED recovered money from relative of TMC Minister Parth Chatterjee in raids related to SSC scam #paisapaisa 🙂 pic.twitter.com/rn5PdbsiQD
— Lalit Tiwari (@lalitforweb) July 22, 2022
అలాగే ఈ స్కామ్తో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు, అధికారులు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల ఇళ్లలో జరిపిన సోదాల్లో.. డాక్యుమెంట్లు, అనుమానంగా ఉన్న కంపెనీల వివరాలు, ఫారెన్ కరెన్సీ, బంగారం సీజ్ చేశారు. కొన్ని నెలల క్రితం గ్రూప్ సీ, డీ సిబ్బంది, తొమ్మిది, పన్నెండు తరగతుల అసిస్టెంట్ టీచర్లు, ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్పై విచారణ జరపాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అలాగే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసుల దర్యాప్తు జరుగుతోంది. ఈడీ అధికారుల సోదాల్లో రూ.20 కోట్లు పట్టుబడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ED is carrying out search operations at various premises linked to recruitment scam in the West Bengal School Service Commission and West Bengal Primary Education Board. pic.twitter.com/oM4Bc0XTMB
— ANI (@ANI) July 22, 2022