టీకా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా మూడు రాష్ట్రాల్లో కోటి మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు కలిసి కోటికి పైగా డోసులను అందించాయని పేర్కొంది. వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని సాధించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా కోటి మందికి టీకా వేశారు. ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ వేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ట్విట్టర్లో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క రోజే కోటికిపైగా డోసులను పంపిణీ చేసి రికార్డు నెలకొల్పడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్లో 28.62 లక్షల మందికి టీకాలు వేయగా తర్వాత కర్ణాటకలో 10.79 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకూ వ్యాక్సినేషన్ విషయంలో మొదటి స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
దేశంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ జూన్లో ప్రకటించిన తర్వాత టీకా పంపిణీ వేగవంతమయ్యింది. ఉచిత వ్యాక్సినేషన్లో భాగంగా తయారీ సంస్థల నుంచి ఉత్పత్తి అయిన 75 శాతం టీకాలను కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందజేస్తోంది. మిగతా 25 శాతం టీకాలు ప్రయివేట్ ఆస్పత్రులకు కేటాయించారు. కొవిన్ పోర్టల్ ద్వారా టీకా రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ అంశంపై మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 62 కోట్ల పైగా డోస్లను వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 4.05 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది రెండో డోస్లు తీసుకున్నట్టు కొవిన్ పోర్టల్లో నమోదయ్యింది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు దేశ వ్యాప్తంగా 1,02,06,475 వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగినట్టు కొవిన్ పోర్టల్లో నమోదైంది.
Record vaccination numbers today!
Crossing 1 crore is a momentous feat. Kudos to those getting vaccinated and those making the vaccination drive a success.
— Narendra Modi (@narendramodi) August 27, 2021