తమిళనాడులో ఊహించని దారుణం వెలుగు చూసింది. ఓ కన్న కొడుకు కనిపెంచిన తల్లిదండ్రులను కసితీరా కొడవలితో హత్య చేశాడు. ఇక ఈ ఘటన బయటకు రాకుండా ఆ దుర్మార్గుడు ఇంట్లోనే వండుకుని తిన్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కనిపెంచిన తల్లిదండ్రులను ఆ కొడుకు ఎందుకు చంపాలనుకున్నాడు? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ క్రైమ్ స్టోరీ చదవాల్సిందే. అది తమిళనాడు తంజావూరు జిల్లా కుంభకోణం పరిధిలోని పట్టీశ్వరం తియ్యంపూర్. ఇదే ప్రాంతంలో గోవిందరాజ్ (80), లక్ష్మి (73) దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అయితే పెద్ద కుమారుడు గతంలో మరణించడంతో ఆ దంపతులు కూతురు పెళ్లి చేశారు. ఇక చిన్న కుమారుడు రాజేంద్రన్ ( 45) తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే రాజేంద్రన్ మతిస్థిమితం సరిగ్గా ఉండకపోవడంతో తల్లిండ్రులు అతనికి పెళ్లి చేయలేదు. దీంతో అప్పటి నుంచి రాజేంద్రన్ జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. మరో విషయం ఏంటంటే? పెళ్లి చేయలేదనే కారణంతో రాజేంద్రన్ తరుచు తల్లిదండ్రులతో పాటు గొడవకు దిగుతుండేవాడు. అయితే రాజేంద్రన్ ఇటీవల మరోసారి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన రాజేంద్రన్ ఇంట్లో ఉన్న కొడవలితో తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. కుమారుడి దాడిలో తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
అయితే రాజేంద్రన్ తల్లిదండ్రులను హత్య చేసిన విషయం బయటకు రాకుండా రెండు రోజులు శవాలతో పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఇంతటితో ఆగకుండా తల్లిదండ్రుల శవాలే మధ్య రెండు రోజుల పాటు వండకుని తిన్నాడు. కానీ రెండవ రోజు రాజేంద్రన్ ఉంటున్న ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారి ఇంట్లోకి వెళ్లారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారు. ఈ సీన్ ను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అనంతరం నిందితుడు రాజేంద్రన్ పై కేసు నమోదు చేసుకుని అతనిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.