గురువారం తెల్లవారు జామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి బీజేపీ పార్టీ ఆఫీస్ పై పెట్రోల్ బాంబులు విసిరారు. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఈఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బాంబులతో దాడి చేసి అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. గురువారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు భాజపా నాయకుడు కరాటే త్యాగరాజన్ తెలిపారు.
గతంలో కూడా డీఎంకే ప్రమేయంతో ఇలాంటి ఘటన జరిగిందని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వ పాలనను ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమ పార్టీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరగడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చేశారు. బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంపై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయం పాటించాలని పార్టీ పెద్దలు కోరారు.
ఇది కూడా చదవండి: మరణంలోనూ వీడని స్నేహబంధం!
ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా చెన్నైలోని నందనం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వినోద్ గా గుర్తించి, ప్రశ్నిస్తున్నారు. మిగిలిన వారికి కోసం పరిస ప్రాంతాలల్లోని సీసీ పుటేజిని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన మిగిలిన నిందితులను గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
Chennai | An unidentified person allegedly throws a petrol bomb at Tamil Nadu BJP office around 1 am. Details awaited. pic.twitter.com/vglWAuRf5G
— ANI (@ANI) February 9, 2022