ప్రస్తుతం దేశం చలికి వణుకుతోంది. ఉత్తర భారతదేశంలో ఇది ఇంకాస్త ఎక్కువే. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి ప్రజలు గజగడలాడుతున్నారు. ప్రజలంతా శీతలగాలుల నుంచి రక్షణకు ఊన్ని దుస్తుల్ని, చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మనతోపాటు దేవుడికి కూడా చలేస్తుంది కదా! అని ఆలోచన వచ్చినట్లుంది అయోధ్యలోని ఆలయల నిర్వాహకులకు.
దేవతామూర్తులకు చలి వేయకుండా వెచ్చని దుస్తులను కప్పి ఉంచారు. అయోధ్యలోని ప్రధాన ఆలయంతో పాటు శ్రీరామ వల్లభ కుంజ్, కనక్ భవన్, హనుమాన్ గఢీ, నగేశ్ వార్నాత్ దేవాలయాల్లో ప్రస్తుతం దేవతల విగ్రహాలపై దుప్పట్లు, ఉన్ని దుస్తులు, శాలువాలు దర్శనమిస్తున్నాయి.
“అయోధ్యలో శ్రీరాముడు సహా దేవతా విగ్రహాలకు గతం నుంచే దుప్పట్లు, ఉన్ని దుస్తులను కప్పుతున్నాం. దేవతామూర్తులు నిద్రించడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. దేవుళ్లకు రాత్రంతా వేడిగాలి తగిలేలా మిషన్లను ఉపయోగిస్తున్నాం” అని రామ్ ల్లా ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. దేవుళ్లకు చలి నుంచి రక్షణ కోసం ఓ భక్తుడు రెండు దుప్పట్లు, స్వెటర్లు తయారు చేసి ఇచ్చినట్లు పూజారి తెలిపారు. అయోధ్యలోని ఆలయాల నిర్వాహకులు దేవుళ్లకు చేసిన ఈ ప్రత్యేక ఏర్పాట్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.