మనదేశంలోని తొలి ఓటరుగా గుర్తింపు పొందిన శ్యామ్ శరణ్ నేగి ప్రస్థానం ముగిసింది. 106 ఏళ్ల వయస్సులో అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారు. 1917లో హిమాచల్ ప్రదేశ్ లో శ్యామ్ శరణ్ నేగి జన్మించారు. భారతదేశాన్నికి 1947 ఆగష్టు15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే 1951లో మొదటి సారి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శ్యామ్ శరణ్ నేగి తొలి ఓటు వేసిన వ్యక్తి గుర్తింపు పొందారు. 1951 దేశమంతా ఎన్నికలు జరిగాయి. అయితే కొన్ని కారణాల వలన ఓ ఐదు నెలల ముందే హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో ఆయన మొదటి ఓటు ఉపయోగించుకోవడం వలన చరిత్రలో నిలిచారు. ఇక అప్పటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ప్రతి ఎన్నికల్లో శ్యామ్ నేగి.. తన ఓటు హక్కు వినియోగించుకుంటు వస్తున్నారు.
స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) శనివారం ఉదయం కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా కల్పా అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన వృతిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అంతలోనే ఆయన మరణించారు. ఐతే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధాప్య కారణాలతో పోస్టల్ బ్యాలెట్ ఓటుకు దరఖాస్తు చేసుకున్న ఆయన.. నవంబరు 2న ఇంటి నుంచే తొలిసారి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేశారు. తన ఇంటి ముందు ఉన్న పోస్టల్ బూత్ వద్దకు రెడ్ కార్పెట్ పరిచారు.
నేగీని అధికారులు కార్పెట్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలా తన ఓటు హక్కు వినియోగించుకున్న రెండు జులకే నేగి తుది శ్వాస విడిచారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం గొప్ప పండగ అని నేగీ తరచూ అంటుండేవారు. 1951లో తొలి ఓటు వినియోగించుకున్న ఆయన.. ఇప్పటి వరకు 16 సార్లు లోక్ సభకు వేటు వేశారు. అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ , స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిపి.. ఇప్పటి వరకు ఆయన 34 సార్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయన మృతి పట్ల ఆ రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు.
తాను తొలి సారి వేటు వేసే సమయంలో దేశంలో పరిస్థితుల గురించి శ్యామ్ శరణ్ నేగి చాలా సార్లు తెలియజేశారు. ఆ సమయంలో తాను మురుంగ్ లో ఉండి.. ఎన్నికల్లో సందర్భంగా విధులు నిర్వహిస్తున్నట్టు శ్యామ్ చెప్పారు. ఆ రోజుల్లో ఎవరూ ఓటు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదని, కేవలం 30, 40 శాతం ఓటింగ్ జరిగితే గొప్పగా అనిపించేదని శ్యామ్ చెప్పారు. అప్పుడు తాను ఎన్నికల్లో ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కని చెప్పి.. ఓటు వేయడం మన కర్తవ్యంగా భావించానని తెలిపారు.
The first voter of Independent India,Shyam Saran Negi (106) who hails from the tribal district of Kinnaur in #HimachalPradesh exercised his right to franchise for the 34th time!
He voted in the 14th Vidhan Sabha Elections through postal ballot in Kalpa today. @SpokespersonECI pic.twitter.com/0m1p4vJuKv— All India Radio News (@airnewsalerts) November 2, 2022