ఇటీవల టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణంతో రోడ్డు భద్రత, దానికి సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలని చర్చలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రోడ్డు రవాణా నిబంధనల ప్రకారం.. కారు ముందు సీట్లో కూర్చున్న వారు మాత్రమే సీటు బెల్టు ధరిస్తున్నారు. వెనక ఉన్న వారు సీటు బెల్టు పెట్టుకోకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు వెనక ఉన్న వారు ఖచ్చితంగా సీటు బెల్టు పెట్టుకోవాలన్న నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వారు సీటు బెల్టు పెట్టుకోకపోతే జరిమానా విధిస్తామని కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
అంతేకాదు కార్ల తయారీ కంపెనీలు కూడా వెనుక సీట్లో కూర్చుని ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకునేలా అలార్మ్ లను ఏర్పాటుచేయడం తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. సైరస్ ప్రమాదానికి గురైన తర్వాత తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, వెనుక సీట్లో కూర్చున్న వారు సీటు బెల్టు పెట్టుకునేవరకూ అలారమ్ మోగుతూనే ఉంటుందని అన్నారు.సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే సైరస్ మిస్త్రీతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి మరణించాడని కథనాలు రావడంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వెనుక కూర్చున్న వారు సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి వెనుక సీట్లో కూర్చున్న వారు కూడా సీటు బెల్టు ధరించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా శాఖ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Almost all I know don’t fasten seat belt while sitting in the car’s rear. #CyrusMistry was sitting in the rear seat minus the seat belt during collision. This simulation shows what happens to an unbelted rear seat passenger in case of a collision. Please #WearSeatBelt ALWAYS! pic.twitter.com/HjS9weMOT0
— Rajesh Kalra (@rajeshkalra) September 5, 2022