దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల వాహనాలు సైతం వరదల్లో చిక్కుకుని ఆ నీటిలోనే కొట్టుకుపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో సైతం భారీగా కురుస్తున్న వర్షాలకు నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాష్ట్రంలోని షాజాపూర్ లో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 24 మంది విద్యార్థులు ఉన్న ఓ స్కూలు బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది.
A school bus got stuck in a drain of water near Bikalkhedi village of Shajapur district, more than 24 school children were in the bus, the villagers present on the spot showed agility and pulled the bus out of the water by tying a rope with the help of a tractor.#madhyapradesh pic.twitter.com/ZvfnKVrBLG
— Siraj Noorani (@sirajnoorani) July 23, 2022
దీంతో ఎటు కాదలేక ఉండడంతో బస్సులో ఉన్న విద్యార్థులు బిక్కుబిక్కుమంటు భయంతో కేకలు వేశారు. వెంటనే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన గ్రామ ప్రజలు, స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. హుటాహుటిన ఓ ట్రాక్టర్ సాయంతో వరదలో చిక్కుకున్న ఆ స్కూలు బస్సును చాకచక్యంగా బయటకు తీశారు. పిల్లలందరూ క్షేమంగా ప్రాణాలతో బయటపడడంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా అందరిని షాకింగ్ గురి చేసింది. అయితే ప్రమాదాన్ని అంచనా వేయకుండా డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు.. కంటతడి పెట్టిస్తున్న యువతి మరణం!
#MadhyaPradesh | School Bus With Over 2 Dozen Children Stuck In Drain Amid Heavy Rain, Pulled Out https://t.co/PTKiaw2fSF pic.twitter.com/56dWF8bFPq
— NDTV (@ndtv) July 23, 2022