ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి నడపడం లాంటివి చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. కొన్నిసార్లు డ్రైవర్లు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
జబల్ పూర్ లోని గోహల్ పూర్ వద్ద గురువారం కొంతమంది సిగ్నల్ వద్ద వాహనాలు నిలిపి ఉన్నారు. అటుగా వస్తున్న మెట్రో బస్సు హఠాత్తుగా వారిపై దూసుకు వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్ డ్రైవర్ హర్దేవ్ పాల్ ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన మెట్రో బస్ డ్రైవ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆయన స్టీరింగ్ పైనే పడిపోయి కన్నుమూశాడు. దాంతో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిఉన్న వాహనాలపై దూసుకెళ్లింది. ఆటో, బైకులపై ఉన్నవారిని కొంతదూరం లాక్కెల్లింది.
ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ వృద్దుడు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బస్సు కింద పడి ఎవరూ చనిపోలేదని పోలీసులు తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
CAUGHT ON CAMERA – A city bus in Madhya Pradesh’s Jabalpur ran into several vehicles, killing 2, after its driver died of sudden heart attack. #Jabalpur #MadhyaPradesh #Accident pic.twitter.com/MvOEq3lbHV
— TIMES NOW (@TimesNow) December 2, 2022