అరుదైన రెండు తలల పామును అక్రమ రవాణా చేస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరు పామును నేపాల్ కు తరలించే పయత్నంలో ఉండగా, సమాచారం అందుకున్న పోలీసులు డార్జిలింగ్ అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. దీనిని భారీ ధరకు విక్రయించాలనుకున్నారట.
రెండు తలల పాములు పూర్తిగా విషరహిత సర్పాలు. తోక చివరి భాగం గుండ్రంగా ఉండి తలను పోలి ఉండుటంతో దీనిని రెండు తలల పాము అని పిలుస్తారు. ఇరాన్, ఇండియా, పాకిస్తాన్ లలో వీటి ఉనికి ఎక్కువ. రాను.. రాను.. ఈ పాములు అంతరించిపోతున్నాయి. అందుకు కారణం.. అక్రమ రవాణా. ఔషదాలు, తాంత్రిక పూజల పేరిట ఈ పాములను యచ్చేదిగా అక్రమ రవాణా చేస్తూ కాసులు దండుకుంటున్నారు స్మగ్లర్లు. ఆ ప్రయత్నంలో ఉన్నఓ ముఠా పోలీసులకు చిక్కింది.
అరుదైన రెడ్ శాండ్ బోవా అనే రెండు తలల పామును (శిఖండి) ఓ ముఠా అక్రమంగా తరలిస్తున్నరన్న సమాచారం బెలకోబా ఫారెస్ట్ అదికారులకు అదింది, వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దానిని విక్రయించేందుకు వెళ్తున్న నలుగురు సభ్యుల ముఠాను డార్జిలింగ్ అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు.నిందితులు ఆరిందమ్ సర్కార్, పాసంగ్ లామా షెర్పా, అబావర్ మియా, జగదీశ్ రాయ్గా అధికారులు గుర్తించారు. నిందితులు ఆ శిఖండిని ఏకంగా దేశం దాటించి నేపాల్కు తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డారని తెలిపారు. ఈ పాము దాదాపు ఖరీదు సుమారు రూ.25 లక్షల వరకు పలుకుతుందని అంచనా.
WB | Team of Belacoba forest range seized Red Sand Boa (Eryx johnii) from Darjeeling forest area arrested 4 people in connection with illegal trading. Accused identified as Arindam Sarkar, Pasang Lama Sherpa, Abavar Miya & Jagadish Ch Roy. It was scheduled for delivery to Nepal. pic.twitter.com/tW3wrVmVvJ
— ANI (@ANI) February 21, 2023