వివాహాల వేళ మేనమామలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా మేనకోడలి వివాహం వేళ.. మేనమామ చాలా తంతులు చేయాల్సి ఉంటుంది. అవేకాక.. తనకు చేతనైనంత ఆర్థిక సాయం కూడా చేస్తాడు. ఇప్పుడు మీరు చదివే ఘటనలో మేనమామలు కోట్ల రూపాయలు మేనకోడలకి కట్నంగా ఇచ్చారు. ఆ వివరాలు..
మన భారతీయ సమాజంలో బంధాలు, బంధుత్వాలకు చాలా ప్రాధాన్యత ఉంది. మన సమాజంలో మేనమామ అనగా తల్లి సోదరుడిని తండ్రి తర్వాత తండ్రిగా భావిస్తారు. వివాహాలు, ఇతర శుభకార్యాల్లో మేనమామలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైనా స్త్రీకి భర్త చనిపోతే.. ఆమె కుమార్తె వివాహ సమయంలో మేనమామే కన్యాదాతగా వ్యవహరిస్తాడు. ఆయన ఉన్నంత కాలం సోదరి, ఆమె కుటుంబ సభ్యుల బాగోగుల గురించి ఆలోచించడమే కాక.. వారి ఇంట జరిగే ప్రతి శుభకార్యంలో ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ముగ్గురు మేనమామలు.. తమ మేనకోడలి వివాహం సందర్భంగా ఏకంగా కోట్ల రూపాయల బహుమతులు కట్నంగా అందించారు. వీటి విలువ సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అంతేకాక.. అక్కడ మేనకోడలి వివాహానికి మేనమామే కట్నం ఇవ్వడం ఆచారం అంట. మరి ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..
మేనకోడలి పెళ్లికి భారీగా విరాళం అందించారు ముగ్గురు సోదరులు. మొత్తం రూ.3.21 కోట్ల విలువ చేసే నగదు, ఆస్తులను మేనకోడలి పెళ్లికి కట్నంగా అందించారు. ఈ సంఘటన రాజస్థాన్, నాగౌర్ జిల్లా బుర్డీ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భన్వర్లాల్ గర్వాకు ముగ్గురు కుమారులు హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్రలతో పాటు ఒక కుమార్తె అనుష్క కూడా ఉంది. గ్రామంలో వీరిది బాగా ధనిక కుటుంబం. ఈ ముగ్గురు అన్నదమ్ముల పేరు మీద ఏకంగా 2,166 ఎకరాల భూమి ఉందంటేనే వీరు ఎంత ఐశ్వర్యవంతులో అర్థం చేసుకోవచ్చు. ఇక భన్వర్లాల్ కుమార్తె అనుష్కకు దింసరి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది.
ఇక తాజాగా అనుష్క కుమార్తెకు వివాహం నిశ్చయం అయ్యింది. ఈ క్రమంలో అనుష్క సోదరులు ముగ్గురు.. తమ మేనకోడలి పెళ్లికి రూ.3.21 కోట్ల విలువ చేసే నగదు, ఆస్తులను కట్నంగా ఇచ్చారు నగదు, భూమి, వస్తు, ఆభరణాల రూపంలో ఈ కట్నం అందించారు. వీరు ఇచ్చిన భారీ కట్నంలో సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమి, రింగ్ రోడ్డు పక్కన 30 లక్షలు విలువ చేసే ప్లాట్ ఉంది. అలానే వివాహం సందర్భంగా మేనకోడలికి ఏకంగా 41 తులాల బంగారం, మూడు కేజీల వెండిని కట్నంగా ఇచ్చారు. ఇవేకాక ట్రాక్టర్, స్కూటీతో పాటు రూ.80 లక్షల నగదును సైతం మేనకోడలికి కానుకగా ఇచ్చారు ఈ ముగ్గురు సోదరులు. వీరి సమాజంలో మేనమామలు మేనకోడలికి ఇచ్చే కట్నాన్ని మైరా అంటారు.
అయితే బుర్డీ గ్రామంలో మైరా సంప్రదాయం అనాదిగా ఆచరణలో ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని పాటించాలి. దీని ప్రకారం మేనకోడలి వివాహానికి మేనమామలే కట్నకానుకలు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే ‘మైరా’గా పిలుస్తారు. హిందూ సంప్రదాయ పెళ్లిలో ఇది ఒక భాగం. చెల్లెలి పిల్లల వివాహం సందర్భంగా ఆమెపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఆమె సోదరులు ఈ మైరాను అందజేస్తారు. ఈ మైరా పద్దతిలో సోదరి కుమార్తె అనగా మేనకోడలి పెళ్లికి మేనమామలే కట్నకానుకలు సమకూర్చాల్సి ఉంటుంది. అంతేకాక మేనమామలే దగ్గరుండి మరీ మేనకోడలి వివాహం జరిపిస్తారు.
బుర్డీ గ్రామాలో మైరా సంప్రాదాయం ఎప్పటి నుంచో అమల్లో ఉన్నప్పటికి.. ఇంత భారీ మొత్తాన్ని ఎవరు ఇవ్వలేదు. మేనకోడలి పెళ్లికి ఏకంగా రూ.3 కోట్లకు మైరా ఇచ్చి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఈ ముగ్గురు అన్నదమ్ములు. అయితే కేవలం మేనకోడలి వివాహానికి మాత్రమే కాకుండా మేనల్లుడి పెళ్లికి అయ్యే ఖర్చులను కూడా.. మేనమామలు భరించే సంప్రదాయం ఈ గ్రామంలో ఉంది.
ఈ సందర్భంగా అనుష్క ముగ్గురు సోదరులు మాట్లాడుతూ.. ‘‘ఇది మా చెల్లి కూతురు పెళ్లి. ఈ వివాహం చాలా కాలం అందరికి గుర్తుండిపోయేలా ఎంతో ఘనంగా చేయాలని మేం భావించాం. అందుకే భారీ మైరాను మా మేనకోడలికి ఇచ్చాం. మేమిచ్చిన కట్నకానుకలతో వధువు, వరుడు కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. వివాహం సందర్భంగా నూతన వధూవరులిద్దిరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి’’ అని ఆశీర్వదించారు. మేనమామలు అనుష్క కుమార్తెకు ఇచ్చిన మైరా.. నాగౌర్ జిల్లాలో రికార్డ్ బ్రేక్ చేసింది. ఇంతకముందెప్పుడు ఇంత భారీ మొత్తంలో ఎవ్వరూ మైరా ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. మరి ఈ మైరా సంప్రదాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
फिर मायरा दहेज से अलग कैसे हुआ ? बस देने का तरीका ही अलग दिख रहा है.#Nagaur pic.twitter.com/gzVhmA9onG
— अवधेश पारीक (@Zinda_Avdhesh) March 16, 2023