కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఆచారాల్లోనూ ప్రతిఫలిస్తోంది. తెలుగు నేలపైన ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆలయంలో నైవేద్యంగా ఏ పులిహోర, చక్కెర పొంగలి, స్వీట్లో సమర్పిస్తారు. వీటికి విరుద్దంగా మద్యాన్ని సమర్పించే విచిత్రమైన ఆనవాయితీ కొనసాగుతోంది. పురుషులు మాత్రమే పాల్గొనే వేడుక. మందు, విందుతో దేవుడికి నైవేద్యం పేరుతో మజా చేసే సంస్కృతి. పూర్వీకుల పేరుతో ఆచారం పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది ఈ తంతు. వానలు బాగా పడాలంటూ గుళ్లో దేవుడికి మందు, మాంసం నైవేద్యంగా సమర్పించి ఎంచక్కా ఆరగించడమే.
చెన్నై, పెరంబూర్ లో ఈ వింత ఆచారం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తు తుంది. ఓ వైపు కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతో జనజీవనం అతలాకుతలం అవుతుంటే మరోవైపు చెన్నైలో వర్షాలు కురవడం లేదంటూ వానలు పడాలంటూ వీరు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. మదురై జిల్లా మేలూరు సమీపంలో వర్షాలు కురవాలని మద్యం బాటిళ్లతో కోడి మాంసం నైవేధ్యంగా సమర్పించి, పురుషులు మాత్రమే పాల్గొనే వినూత్న వేడుక జరిగింది. ఆలయానికి భక్తులు సమర్పించే కోళ్లను బలిచ్చి, మట్టి పాత్రల్లో మాంసం వేసి వండుతారు.
మద్యం అలవాటు ఉన్న భక్తులకు మాత్రమే బాటిళ్లు అందజేస్తారు. అనంతరం అందరూ ఆలయ ప్రాంగణంలోని మద్యం సేవించి నైవేధ్యంగా సమర్పించిన కోడి మాంసాన్ని భుజిస్తారు. ఇలా చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పాతతరం వారు చెప్పేవారని, నేటికీ ఆ వేడుకలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఆలయానికి భక్తులు సమర్పించే కోళ్లను బలి ఇచ్చి మట్టిపాత్రలో మాంసం వేసి వండుతారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను పేర్చుతారు. కేరళలో కూడా దుర్యోధన ఆలయంలో వైన్ ప్రసాదంగా పెడతారు.