సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు, రాజకీయ నేతలకు సంబంధించిన ఎన్నో ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. అయితే వాటిలో కొన్ని వీడియోలు, ఫోటోలపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయం ఇట్టే వైరల్ అవుతుంది. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు, పొలిటీషియన్స్ , క్రీడాకారులకు సంబంధించిన విషయాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటి నుంచి ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి కర్ణాటకలో తనదైన స్టైల్లో ప్రచార కార్యక్రమంలో దూసుకు పోతున్నారు. తాజాగా ఆమె కర్ణాటకలోని మైసూర్ లో ఓ హూటల్ లో దోసెలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తనదైన జోరు కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో అధికార పక్షం బీజేపీ నేతలు జోరుగా ప్రచారం కొనసాగిస్తుంటే.. వారికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి ప్రియాంక గాంధీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రియాంక గాంధీ మైసూరులోని మైలారీ అగ్రహార రెస్టారెంట్ కి వెళ్లి దోసెలు ఎలా వేయాలో నేర్చుకొని స్వయంగా పిండి కలిపి.. దోసెలు వేశారు. అనంతరం దోసెలను అట్లకాడతో తిప్పారు. ఇక ప్రియాంక గాంధీ దోసెలు వేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా తిలకించారు. దోసెలు వేసిన అనంతరం పలువురు కస్టమర్లతో ఆమె ముచ్చటించారు. తర్వాత ప్రియాంక గాధీ సహా కాంగ్రెస్ నేతలు ఇండ్లీ ఆరగించారు.
ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ మైసూర్ లో పర్యటిస్తున్నారు. తమ అభ్యర్థుల తరుపు నుంచి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. ప్రియాంక దోసెలు వేస్తున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇటీవల కాంగ్రెస్ ముఖ్యనేత రాహూల్ గాంధీ సైతం వచ్చి సభలు, ర్యాలీలు నిర్వహించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడించనున్నారు.
Enjoyed making dosas with the legendary Myalri Hotel owners this morning….what a shining example of honest, hard work and enterprise.
Thank you for your gracious hospitality.
The dosas were delicious too…can’t wait to bring my daughter to Mysuru to try them. pic.twitter.com/S260BMEHY7— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 26, 2023