ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరాన్ని సందర్శించారు. ప్రముఖ కవి సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ప్రార్థనలు చేశారు. అక్కడున్న భక్తులతో కలిసి ప్రధాని కీర్తలను ఆలపించారు. అందుకు సంబంధించిన వీడియో తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి మోదీ పోస్ట్ చేశారు. ఆ వీడియోకి ‘ఢిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరంలో చాలా ప్రత్యేకమైన క్షణాలు’ అంటూ క్యాప్షన్ పెట్టారు.
Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg
— Narendra Modi (@narendramodi) February 16, 2022