అన్నదాతలు ప్రతి ఏడాది రూ.42 వేలు పొందే వెసులుబాటు ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాల్సిందే.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిల్లో మనం ఇప్పుడు రెండు పథకాల గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్స్ ద్వారా అన్నదాతలకు ఏటా రూ. 42 వేలు లభిస్తాయని చెప్పొచ్చు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో చేరిన వారికి మోడీ సర్కారు ఏటా రూ. 6 వేలు ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి చేతిలోకి రావు. ఇవి విడతల వారీగా వస్తుంటాయి. నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ. 6 వేలు రైతులకు లభిస్తాయి. ఈ స్కీమ్లో ఇప్పటికే చాలా మంది అన్నదాతలు చేరారు. పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఈ స్కీమ్లో మీరూ చేరొచ్చు.
బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు, ఆధార్ రిజిస్టర్డ్ అయిన ఫోన్ నెంబర్, పొలం పట్టా లాంటివి ఉంటే సరిపోతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరిపోవచ్చు. ఫ్రీగానే ఈ పథకంలో చేరొచ్చు. ప్రతి ఏటా రూ. 6 వేలు వరకు పొందొచ్చు. ఈ స్కీముకు సంబంధించి 13వ విడత డబ్బులను ఇటీవలే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి సర్కారు జమ చేసింది. రైతన్నల కోసం మరో పథకాన్ని కూడా భారత ప్రభుత్వం అందిస్తోంది. దీని పేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఇందులో చేరడం ద్వారా అన్నదాతలకు ప్రతి నెలా రూ. 3 వేలు లభిస్తాయి. అంటే ఏడాదికి రూ. 36 వేలు వరకు పొందొచ్చు. అయితే ఈ డబ్బులు పొందాలంటే రైతులు నెలకు రూ. 55 చెల్లించాల్సి ఉంటుంది. రైతుల వయసు ప్రాతిపదికన చెల్లించాల్సిన మొత్తం అనేది ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్ల వయసులోనే ఈ స్కీములో జాయిన్ అయితే నెలకు రూ.55 కడితే సరిపోతుంది. వయసును బట్టి గరిష్టంగా రూ. 200 వరకు కట్టాల్సి వస్తుంది.
ఈ స్కీములో చేరిన వారు ఇలా ప్రతి నెలా డబ్బులు కడుతూ వెళ్లాలి. లేదంటే బ్యాంక్ అకౌంట్కు ఆటో డెబిట్ ఫీచర్ను యాక్టివేట్ చేసుకున్నా సరిపోతుంది. దీని ద్వారా బ్యాంక్ ఖాతాలో నుంచి ప్రతి నెలా డబ్బులు వాటంతట అవే ఆటోమేటిక్గా కట్ అవుతాయి. రైతులకు 60 ఏళ్లు వచ్చాక ప్రతి నెలా రూ. 3 వేలు వస్తాయి. కాగా, కేంద్ర సర్కారు అందిస్తున్న ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు చేరడానికి అవకాశం ఉంటుంది. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి ఇందులో ఉచితంగా చేరొచ్చు. ఈ స్కీములో చేరిన వ్యక్తి ఒకవేళ చనిపోతే.. అప్పుడు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి వెనక్కి ఇస్తారు లేదంటే భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించొచ్చు. పథకంలో వ్యక్తి మరణిస్తే.. భాగస్వామికి ప్రతి నెలా పెన్షన్ రూపంలో రూ.1,500 వస్తుంది. ఇద్దరూ చనిపోతే.. అప్పుడు నామినీకి కట్టిన డబ్బులు చెల్లిస్తారు.