మనం పెంచుకునే జంతువుల్లో అతి విశ్వాసమైనదిగా శునకానికి పేరు. అది తన యాజమానికి కోసం ప్రాణాలను సైతం ఇస్తుంది. నమ్మకానికి ప్రతీరూపం కుక్క. అందుకే ఎక్కువ మంది శునకాలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాటికి వివిధ ముద్దు పేర్లు పెట్టి.. ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. ఇలా మనం పెంచుకునే కుక్కల్లో కొన్ని చాలా ఖరీదైనవి ఉంటాయి. వెేల నుంచి లక్షల వరకు ఉంటాయి. తాజాగా నవరాత్రి ఉత్సవాల్లో ఓ పెంపుడు శునకం అందరి దృష్టిని ఆకర్షించింది. ముద్దుగా ఉండటమో, వింతగా ఉండటం వల్లనో కాదు.. వేలంలో ఆ శునకం భారీ ధర పలకడం. దీంతో ఆ కుక్కను చూడటానికి స్థానికులు పోటెత్తారు. ఇంతకు ఆ శునకం ఎంత ధర పలికిందో తెలుసా.. అక్షరాల పది కోట్ల రూపాయలు. మరి.. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశ వ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోన్నారు. వివిధ కార్యక్రమాలతో, జంతువుల ప్రదర్శనలతో వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గంలో కూడా దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతోన్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా డాగ్ షో నిర్వహించారు. ఇందులో ఓ పెంపుడు శునకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలంలో ఇది భారీ ధర పలికి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీని ధర వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఈ పెంపుడు శునకం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అక్షరాల 10 కోట్ల రూపాయలు. బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి ఈ శునకాన్ని.. ఈ పోటీలకు తీసుకొచ్చారు. ఇది ‘టిబెటన్ మస్తఫ్’ జాతికి చెందిన శునకమని సతీశ్ చెబుతున్నారు. దీనిని రెండున్నరేళ్ల క్రితం చైనా నుంచి తీసుకొచ్చినట్లు సతీశ్ అన్నారు.
ఈ శునకాన్ని ‘భీమా’ అని పిలుస్తుంటామని సతీశ్ అన్నారు. ఇంత భారీ ధర పలికిన శునకాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు డాగ్ షో కు తరలివచ్చారు. ఆ బంగారు శునకంతో సెల్ఫీలు దిగేందుకు ప్రేక్షకులు పోటీపడ్డారు. ఈ కుక్కను సతీష్ ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్నారంట. సమయానికి రుచికరమైన ఆహారం అందిస్తూ.. రోజంతా ఏసీలోనే ఉంచుతున్నారంట. చికెన్ లెగ్పీసులు, ఖరీదైన ఇతర ఆహారాన్ని ఈ కనకం లాంటి శునకానికి అందిస్తారంట. రెడీమేడ్ ఆహారం, పచ్చి మాంసాన్ని కూడా ఎక్కువగా ఇస్తుంటారు. దీని బరువు వంద కిలోల కంటే ఎక్కువే. రోజుకు ఒక కిలోమీటరు దూరం మాత్రమే నడుస్తుంది. ఈ ‘భీమా’ అనే శునకం పోషణ కోసం ప్రతినెలా రూ.25వేలు ఖర్చు అవుతున్నట్లు సతీశ్ తెలిపారు.