డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కొత్త సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను ఇప్పటికే ఢిల్లీ మెట్రో పార్కింగ్ Delhi Metro Rail Corporation (DMRC) స్థలాల్లో ప్రారంభించింది. ద్విచక్రవాహనాల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పేటీఎం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సేవల్లో అక్వైరింగ్ బ్యాంక్గా వ్యవహరించే పేటీఎం – కావాల్సిన లావాదేవీలన్నింటినీ పూర్తి చేయనుంది. జూన్ నాటికి కోటి ఫాస్టాగ్లను జారీ చేసిన తొలి బ్యాంక్గా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. జూన్ 2021 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 3.47 కోట్ల ఫాస్టాగ్లను జారీ చేశారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఈ సేవలను ఢిల్లీ మెట్రో పార్కింగ్ స్థలాల్లో ప్రారంభించింది.
యూపీఐ ఆధారిత చెల్లింపులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పద్దతిని దేశవ్యాప్తంగా తీసుకువచ్చేందుకు పేటీఎమ్ సిద్ధం అవుతుంది. షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, విమానాశ్రయాలు ఈ ఫాస్టాగ్ పార్కింగ్ పద్దతిని ప్రవేశ పెట్టనుంది. మరి ఈ పాస్టాగ్ పార్కింగ్ పద్దతి ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి. నేషనల్ హైవేలు , రాష్ట్ర రహదారుల మీద ఫాస్టాగ్ పద్దతిన టోల్ చెల్లిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫాస్టాగ్ పద్దతిలో రీఛార్జ్ చేసుకుని టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు వాహనాలు నిలవకుండా ఉండేందుకు ఈ పద్దతి ఉపయోగపడుతుంది. ఐతే ప్రస్తుతం పార్కింగ్ కి కూడా ఫాస్టాగ్ పద్దతిని ఉపయోగించాలని పేటీఎమ్ భావిస్తుంది.
పార్కింగ్ లో నిలిపే వాహనాలు ఫాస్టాగ్ పద్దతిలో డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకురానుంది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఈ సేవలను ఢిల్లీ మెట్రో పార్కింగ్ స్థలాల్లో ప్రారంభించింది. యూపీఐ ఆధారిత చెల్లింపులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పద్దతిని దేశవ్యాప్తంగా తీసుకువచ్చేందుకు పేటీఎమ్ సిద్ధం అవుతుంది. మరి ఈ పాస్టాగ్ పార్కింగ్ పద్దతి ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.