వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ప్రతి ఏటా గణతంత్ర దినోత్సం సందర్భంగా భారత అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులతో సత్కరిస్తారు. అదే విధంగా ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం 106 మందిని పద్మ అవార్డులతో సత్కరించింది. పద్మవిభూషణ్ 6, పద్మ భూషణ్ 9, పద్మశ్రీ అవార్డులకు 91 మంది ఎంపికయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పద్మశ్రీ అందుకున్న వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురిని పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ అవార్డు అందుకున్న తన ఆర్థిక పరిస్థితి మారలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో ఒకరు. 101 ఏళ్ల వయస్సులో ఒంటరిగా జీవిస్తున్న ఆయన.. ఈ బాధలు పడకుండా లోకానే విడవాలనుకుంటున్నారు. ఆయన సరిందా వాయిద్యా కళాకారుడు, 101 కురు వృద్ధుడు మంగళకంటి రాయ్. ఆయనే దీనస్థితిని తెలిసిన ప్రతి హృదయం అల్లాడుతోంది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన మంగళకంటి రాయ్ ‘సరిందా’ వాయిద్యకారుడు. బెంగాల్ లో జన్మించన ఆయన నాలుగేళ్ల వయస్సులోనే సరిందా వాయిద్యాన్ని ప్లే చేయడం నేర్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి నేటి వరకు సరిందా వాయిద్యాంతోనే జీవితాన్ని గడపుతున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు ఓ కూతురు ఉన్నారు. నలుగురు పిల్లలు ఉన్నా కూడా 101 ఏళ్ల వయసులో ఆయన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మంగళ కంటి రాయ్ కి పద్మశ్రీ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించగా.. తన ఆవేదనను వ్యక్తం చేశారు. మంగళ కంటి రాయ్ చెప్పిన మాటలు మనస్సున ప్రతి హృదయాన్ని కదిలించింది. పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, అయితే ఈ అవార్డు తన ఆర్థిక స్థితిని ఏమాత్రం మార్చలేదని అన్నారు.
తాను నమ్ముకున్న కళ.. తనకు ఆర్థికంగా సాయపడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అనేక బాధలు పడకుండా లోకాన్నే విడవాలనుకుంటున్నానని మంగళ కంటి రాయ్ అన్నారు. కరోనా కారణంగా తన జీవితం అస్తవ్యస్తమైందని, ఈ కోవిడ్ వలన తన పరిస్థితి దారుణంగా మారిపోయిందని, రెండేళ్ల నుంచి ప్రదర్శనలకు ఎవరు పిలవడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. పిల్లలు ఉన్నా కూడా జీవితం చివరి దశలో ఒంటరిగా గడుపడం చాలా బాధగా ఉందన్నారు. మరి.. కడు పేదరికంలో మగ్గిపోతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మంగళకంటి రాయ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.