రైలు ప్రమాదం వెనుక భారీ స్కెచ్! ఆ సెట్టింగ్​ను కావాలనే మార్చారా?

ఒడిశా రైలు ప్రమాదానికి ఇంటర్​లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడమే ప్రధాన కారణంగా తేలింది. అయితే ఇది ఎవరు చేశారు? కావాలనే చేశారా? మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 08:58 AM IST

దేశవ్యాప్తంగా ప్రజల్ని తీవ్రంగా కలచివేసిన ఒడిశా పెను ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటనేది బయటపడింది. రైళ్లు సేఫ్​గా నడపడంలో అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్ ఇంటర్​లాకింగ్ సిస్టమ్​’లో మార్పులు చేయడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని తేలింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, విధ్వంసం సృష్టించే ఆలోచనతోనే ఇలా చేశారా అనేది తేల్చేందుకు సీబీఐని రంగంలోకి దించనున్నారు. ఈ ఘోర ప్రమాదంలో రైళ్లను నడుపుతున్న లోకోపైలట్ల (డ్రైవర్ల) తప్పు లేదని ఉన్నతాధికార వర్గాలు క్లీన్ చిట్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రైలు పట్టాలు మారుతూ వెళ్లడంలో ఇంటర్​లాకింగ్ వ్యవస్థే ప్రధానంగా మారింది. ఈ అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. తమ విచారణ పూర్తయిందన్న ఆయన.. ఈ యాక్సిడెంట్​కు మూల కారణమేమిటి, దీనికి బాధ్యులు ఎవరనేది తేలిందని చెప్పారు. పాయింట్ మెషీన్ సెట్టింగ్​ను మార్చడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.

పాయింట్ మెషీన్ సెట్టింగ్​ ఎవరు మార్చారు, ఎలా మార్చారనేది రైల్వే భద్రత కమిషనర్ (సీఆర్​ఎస్) దర్యాప్తు రిపోర్టులో బయటపడుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. యాక్సిడెంట్​ ఘటనపై సీబీఐ ఇన్వెస్టిగేషన్​కు రైల్వే బోర్డు సిఫార్సు చేసిందన్నారు. ఇకపోతే, ప్రమాదానికి కీలకంగా భావిస్తున్న ఇంటర్​లాకింగ్ సిస్టమ్​ను ఎవరు మార్చారు? ఎందుకిలా చేశారు? ఇది కావాలనే చేసిన కుట్రా? దీని వెనుక ఏమైనా భారీ స్కెచ్ ఉందా? అనే ప్రశ్నలు రైల్వే అధికారులను వేధిస్తున్నాయి. విధ్వంసం సృష్టించాలనే దురుద్దేశంతోనే కొందరు వ్యక్తులు.. ఇంటర్​లాకింగ్​ సిస్టమ్​లో మార్పులు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మామూలుగా అయితే ఆ వ్యవస్థలో పొరపాటు జరిగేందుకు ఛాన్స్ లేదని.. కానీ నిజం ఏంటనేది సీబీఐ విచారణలో బయటపడుతుందని అంటున్నారు. కాగా, ఒకే పట్టాల మీదకు ఏకకాలంలో రెండు రైళ్లు రాకుండా మార్గం సుగమం చేసేందుకు ఉద్దేశించిన సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థను ‘ఇంటర్​లాకింగ్’ అని అంటారు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed