సాధారణంగా పాములను చూస్తే భయంతో పారిపోతాం.. ఇది అందరూ చేసే పనే. మాములు పామును చూస్తేనే.. భయంతో గజ్జున వణికిపోతాం.. అందులోనూ నాగు పాము అయితే.. భయంతో ఒళ్ళు జలదరిస్తుంది. కానీ ఒడిశాలో మాత్రం నాగుపాముకి సర్జరీ చేశారు వైద్యులు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ పాముకు ఏమైంది.. ఏ ఆపరేషన్ చేశారు.. ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి అని ఆరా తీస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా, భువనేశ్వర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గర పని చేస్తున్న కూలీలకు మూడున్నర అడుగులున్న నాగుపాము కనిపించింది. ఎంతసేపటకి అది అక్కడి నుంచి వెళ్లకపోవడంతో.. స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు. స్నేక్ హెల్ప్ లైన్ సిబ్బంది వచ్చి ఆ పామును పట్టుకున్న తరువాత అసలు విషయం వారికి అర్థమైంది. దాని పొట్టభాగంలో ఏదో ఇరుక్కుందని.. అందుకే అది ఇబ్బంది పడుతోందని గుర్తించారు. ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ లో ఉన్న జంతువిభాగానికి ఆ పామును తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: ఐస్ బాక్సులో 3 గంటలు నిలబడి గిన్నిస్ రికార్డ్..అక్కడే ఆ పాముకు ఎక్స్ రే తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దాని పొట్ట భాగంలో సీసా మూత ఉందని వారికి అర్థమైంది. దీంతో వెంటనే దానికి ఆపరేషన్ చేశారు. దాని పొట్టలో ఉన్న ఆ సీసా మూతను బయటకు తీశారు. కానీ ఓ వారం రోజులపాటు దానిని పరిశీలనలో ఉంచుతామన్నారు. ఇప్పుడు ఆ పాము ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నాలుగు రోజుల పాటు దానికి కేవలం ద్రవపదార్థాలనే ఆహారంగా ఇస్తారు. తరువాత ఆరోగ్యాన్ని పరిశీలించి ఇతర ఆహార పదార్థాలను అందిస్తారు. నిజానికి నాగుపాము విషపూరితమే అయినా… అది ఉన్న పరిస్థితుల్లో సాయం చేసి మంచి మనసు చాటుకున్నవారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మూగజీవాలపై కరుణ మంచిదే అంటూ వారిని అభినందిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.