న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ అమలు చేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు- వృత్తి భద్రత, ఆరోగ్యం-పని పరిస్థితులు వంటి నాలుగు అంశాల్లో కొత్త లేబర్ కోడ్ అమలు చేయనుంది. కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే.. టేక్ హోం సాలరీ, పని గంటలు, సెలవు దినాలు, పీఫ్ వంటి కీలక అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్, 2021 నుంచే ఈ లేబర్ కోడ్ అమలు చేయాలని భావించి.. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మన దేశంలో శ్రామికులు అనేది అతి పెద్ద సబ్జెక్ట్. లేబర్ కోడ్ అమలు చేయబోయే నాలుగు అంశాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నందున గతేడాది ఈ ప్రతిపాదనను విరమించుకుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ అంశాలకు సంబంధించిన నియమాలను ఖరారు చేశాయి.
ఇదీ చదవండి : వైట్ హౌస్ లో కరోనా కలకలం!
కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే.. ఉద్యోగులు వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అయితే పని గంటలు పెరుగుతాయి. ఉద్యోగి టేక్ హోం సాలరీ తగ్గుతుంది. బేసిక్ సాలరీ, పీఎఫ్ కటింగ్ వంటి అంశాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి.