ప్రజాప్రతినిధులు తమ పర్యటనల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అలానే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే వచ్చే కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు కూడా గట్టి భద్రత చర్యలు తీసుకుంటారు. అలానే ప్రజాప్రతినిధులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినప్పటికి అప్పుడప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇలా జరిగే ప్రమాదాల నుంచి ప్రజాప్రతినిధులు తృటిలో తప్పించుకుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సులేకు కూడా పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆమె చీరకు ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుంది. వెంటనే గమనించి పక్కన ఉన్నవారు మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆదివారం మహరాష్ట్ర లోని పుణెలో ఓ కరాటే పోటీల ప్రారంభోత్సవంలో సుప్రియా సులే పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఆమె ముందుకు వచ్చారు. ఇదే సమయంలో శివాజీ విగ్రహం ముందు ఓ దీపం ఉంది. దానిని గమనించని సుప్రియా సులే.. విగ్రహానికి పూలమాల వేసింది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆ దీపం తగిలి.. ఆమె చీరకు నిప్పంటుకుంది. అయితే వెంటనే పక్కన ఉన్నవారు.. చీరకు మంటలు అంటుకున్న విషయాన్ని ఆమెకు చెప్పారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆమె స్వయంగా చీరకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ఈ హఠాత్తు పరిణామంతో అక్కడి వచ్చిన వారందరు ఆందోళనకు గురయ్యారు.
అయితే సుప్రియ సులే ప్రమాదం నుంచి బయట పడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రమాదంపై ఎంపీ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ” నా శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు, అధికారులకు నాదో విన్నపం. అది ఏమిటంటే.. నేను క్షేమంగా ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందవద్దు. మీరు చూపే ప్రేమ, అప్యాయత, శ్రద్ధ నాకు ఎంతో విలువైనవి. అందరికీ ధన్యవాదాలు” అంటూ సుప్రియా సూలే ప్రకటన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
என்சிபி எம்பி சுப்ரியா சுலேவின் புடவையில் தீப்பிடித்தது ◆ அவர் புனேவில் சிவாஜி மகாராஜுக்கு மாலை அணிவித்துக்கொண்டிருந்தார், அப்போது விபத்து ஏற்பட்டது. ◆ உடனிருந்தவர்கள் தீயை அணைத்து காப்பாற்றினர்.#SupriyaSule pic.twitter.com/V71xaZ9Qzw
— SaveTheNation/தேசம் காப்போம் (@niayayakkural) January 15, 2023