భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. బిపిన్ రావత్ (63), ఆయన భార్య మధులిక సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని నీలగిరి జిల్లా కన్నూర్ సమీపంలో కూలిన ఘటనలో 13 మంది దుర్మణం పాలయిన ఘటన యావత్ భారతాన్ని కన్నీటిపర్యంతం చేసింది. ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డారు. యావత్ భారతం .. ఈ ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తమవుతోంది.
ఇక సోషల్ మాద్యమాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తనదైన శైలిలో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తాజాగా తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనపై స్పందించారు. బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన కామెంట్స్ చేశారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఈ అంశం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని అన్నారు. అయితే దీనికి సంబంధించిన రిపోర్ట్ రాకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని అదే సమయంలో తమిళనాడు లాంటి సేఫ్ జోన్లో మిలటరీ హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడాన్ని సాధారణంగా తీసుకోకూడదని సుబ్రమణ్య స్వామి అన్నారు.