ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఓ వ్యక్తి.. తమ పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో దాన్ని పట్టించిన వారికి రూ.50000 బహుమానం ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెంపుడు చిలుక ఆచూకీ వారం రోజుల తరువాత తెలిసింది. దీంతో దీన్ని పట్టించిన వ్యక్తికి ప్రకటించిన రూ.50000 రివార్డు కన్నా ఎక్కువగా ఇచ్చాడు. ఏకంగా రూ.85,000 బహుమానంగా ఇచ్చాడు. ఆఫ్రికా గ్రే చిలుక “రుస్తుమా” ఇటీవల తన యజమాని దగ్గర నుంచి వెళ్లిపోయింది. అరుదైన చిలుక కావడంతో దీన్ని పట్టించిన వారికి అరలక్ష బహుమతిగా ఇస్తానని ప్రకటించడంతో స్థానికంగా చర్చనీయాశంగా మారింది. వివరాలాల్లోకి వెళ్తే..
కర్ణాటకలోని తుమకూరు జయనగర్ కాలనీకి చెందిన జంతు ప్రేమికుడు రవి.. ఆఫ్రికాకు చెందిన ఓ రెండు చిలుకలను పెంచుకుంటున్నాడు. ఈ రెండింటిలో ఒక చిలుక రుస్తుమా జులై 16వ తేదీన ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. ఎంతో ప్రేమగా పెంచుకునే చిలుకల్లో ఒకటి కనిపించకుండా పోవడంతో రవి కుటుంబం విచారంలో మునిగిపోయింది. తన చిలుక ఆచూకీ తెలియజేసిన వారికి రూ.50 వేలు ఇస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. ఈక్రమంలో తన చిలుక ఆచూకీ తెలియజేసిన వారికి రూ.50 వేలు ఇస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. ఈ క్రమంలో తుమకూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ చిలుకను గుర్తించాడు.
చాలా క్షీణించి ఉన్న ఆ చిలుకను ఇంటికి తీసుకువెళ్లి ఆహారం ఇచ్చాడు. అయితే ఆ చిలుక యాజమాని దాని గురించి వెతుకుతున్నట్లు తెలుసుకున్న శ్రీనివాస్ శుక్రవారం రాత్రి దాన్ని ఓనర్కు అప్పగించాడు. తప్పిపోయిన చిలుక మళ్లీ ఇంటికి వచ్చిన ఆనందంలో ఉన్న ఓనర్ రవి.. చిలుకను పట్టి తెచ్చిన వ్యక్తికి 85 ,000 బహుమతి ఇచ్చాడు. ముందుగా ప్రకటించిన 50 వేల రివార్డు కన్నా.. అదనంగా మరో 35 వేలు ఇచ్చేశాడు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నిజాయితీకి నిలువెత్తు రూపం.. ఈ ట్రాఫిక్ పోలీస్.. రోడ్డుపై దొరికిన.. రూ. 45 లక్షలను..!
ఇదీ చదవండి: తన కోడింగ్ నైపుణ్యంతో విజేతగా నిలిచిన భారత కుర్రాడు! కానీ..జాబ్ రిజెక్ట్ చేసిన అమెరికా కంపెనీ..