దేశంలో ఎంతో మంది అద్భుతమైన కళాకారులు ఉన్నారు. ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమలో ని అద్భుత సృష్టిని బయట పెట్టేందుకు ఇప్పడు సోషల్ మాద్యమాలు ఎంతో సహకరిస్తున్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన కళాకారుడు ఎల్ ఈశ్వర్ రావు ఇటీవల కన్నుమూసిన లెజండ్రీ సింగర్.. గాన కోకిల లతా మంగేష్కర్ ఫోటో ఫ్రేమ్ ని గాజు సీసాలో అమర్చి ఆమెకు గొప్ప నివాళి అర్పించాడు. కుర్దా జిల్లాకు చెందిన ఎల్ ఈశ్వర్ రావుకు మినియేచర్ కళాకృతులు తయారు చేయడం అంటే ఆసక్తి.
గతంలో దుర్గామాత విగ్రహాన్ని ఒక సీసా లోపల సృష్టించి అద్భుతం చేశాడు. క్రిస్మస్ ను పురస్కరించుకుని గాజు సీసాలో క్రిస్మస్ ట్రీ, శాంటా క్లాజ్ ను రూపొందించాడు. ఇలాంటి అద్బుత కళాకండాలు కాటన్, మట్టి, పేపర్ తో పాటు చిన్న చిన్న గాజు ముక్కలను ఉపయోగించి వీటిని రూపొందించినట్లు ఈశ్వర్ రావు చెప్పారు. ఇలాంటి కళాకృతులను రూపొందించిన ఆయన పలువురి ప్రశంసలు పొందారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Odisha | Bhubaneshwar-based miniature artist L Eswar Rao installed a photo frame inside glass bottle as a tribute to legendary singer Lata Mangeskar
The exercise took me 4 days, starting with making photo frame’s base, pasting the photo & fixing it inside the bottle:Rao(11.2) pic.twitter.com/TLnm3saqVz
— ANI (@ANI) February 11, 2022